Home » Maharashtra
గత ఏడాది జులైలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. ప్రిసైడింగ్ అధికారి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.
దేశంలో మూడో వేవ్ కరోనా ముందుగా తలుపు తట్టిన ముంబైలో ఎట్టకేలకు కేసులు తగ్గుముఖం పట్టాయి.
సెల్ సురా గ్రామం దగ్గర రాత్రి 11.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. యావత్మాల్-వార్దా రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. వంతెనపై నుంచి 50 అడుగుల లోయలో కారు పడి పోయింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ట్రాన్స్మిషన్ స్థాయిలోకి వచ్చేయగా ఈ సమయంలోనే మహారాష్ట్రలో స్కూళ్లు తెరవాలని నిర్ణయించుకుంది అక్కడి ప్రభుత్వం.
కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన స్కూళ్లను స్టార్ట్ కానున్నట్లు స్పష్టం చేశారు మహారాష్ట్ర విద్యాశాఖా మంత్రి వర్షా గైక్వాడ్.
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్స్ లో నకిలీ ప్రోఫైల్స్ సృష్టించి 12 మంది మహిళలను మోసం చేసిన బీటెక్ చదివిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 6 వేలు దాటింది. ఇప్పటివరకు 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కు చేరింది.
కర్ణాటకలో కొత్తగా 25005 కేసులు నమోదు, 8 మంది మృతి చెందారు. పశ్చిమబెంగాల్ లో కొత్తగా 23467 కేసులు, 26 మరణాలు నమోదు అయ్యాయి. తమిళనాడులో కొత్తగా 20911 కేసులు, 25 మరణాలు నమోదు అయ్యాయి.
మహారాష్ట్రలో కొత్తగా 46723 కేసులు నమోదవ్వగా, 32 మంది మరణించారు. ఢిల్లీలో కొత్తగా 27561 కేసులు నమోదవ్వగా, 40 మంది మృతి చెందారు. పశ్చిమ బెంగాల్ లో కొత్తగా 22155 కేసులు నమోదు అయ్యాయి.