Attack : పెట్రోల్ డబ్బులు అడిగినందుకు సిబ్బందిపై రాళ్ల దాడి
మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. అర్ధరాత్రి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
man attack petrol bunk staff : మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. అర్ధరాత్రి పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముల్కలపల్లి శివారులో ఉన్న బంక్లోకి ఓ వ్యక్తి పెట్రోల్ కోసం వెళ్లాడు.
అయితే పెట్రోల్ పోసిన అనంతరం డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. డబ్బులు అడుగుతున్న పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడికి దిగాడు. అక్కడే ఉన్న రాళ్లతో వారిపై దాడి చేశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
ఇది గమనించిన పెట్రోల్ బంక్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చే లోపే నిందితుడు పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.