Abdullapurmet Double Murder Case : ఆ ఇద్దరు నగ్నంగా ఉండటం చూసి చంపేశాడు.. అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో సంచలన విషయాలు

యశ్వంత్ ని చివరిసారిగా కలుస్తానని జ్యోతి తన భర్త శ్రీనివాసరావుని అడిగింది. ఇందుకు శ్రీనివాసరావు అంగీకరించాడు. యశ్వంత్ ని ఇంటికి పిలిచి..(Abdullapurmet Double Murder Case)

Abdullapurmet Double Murder Case : ఆ ఇద్దరు నగ్నంగా ఉండటం చూసి చంపేశాడు.. అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసులో సంచలన విషయాలు

Abdullapurmet Double Murder Case

Abdullapurmet Double Murder Case : సంచలనం రేపిన అబ్దుల్లాపూర్ మెంట్ జంట హత్యల కేసు వివరాలను ఎల్బీనగర్ జోన్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ మీడియాకు తెలిపారు. అసలేం జరిగిందో ఆయన వివరించారు. మే 2న అబ్దుల్లాపూర్ మెట్ లో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని తమకు సమాచారం అందిందన్నారు. చనిపోయిన వారిని యశ్వంత్, జ్యోతిగా విచారణలో గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామన్నారు.

ఈ కేసులో జ్యోతి భర్త శ్రీనివాసరావు నిందితుడని, కేసు విచారణలో గుర్తించామని డీసీపీ తెలిపారు. జ్యోతికి, యశ్వంత్ కు కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉందన్నారు. అయితే, ఇది జ్యోతి భర్తకు తెలిసిందని, దీంతో అతడు తన భార్యను మందలించాడని చెప్పారు. అయినా ఆ ఇద్దరూ సంబంధం కొనసాగించారని, దీంతో ఆ ఇద్దరినీ హత్య చేయాలని భర్త శ్రీనివాసరావు పథకం వేశాడని పోలీసులు వెల్లడించారు.(Abdullapurmet Double Murder Case)

Abdullapurmet Murder: వీడిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసు మిస్టరీ

ఈ క్రమంలో తన కుటుంబాన్ని విజయవాడకి మార్చాలని జ్యోతి భర్త శ్రీనివాసరావు అనుకున్నాడు. భర్త అలా చెప్పడంతో.. యశ్వంత్ ని చివరిసారిగా కలుస్తానని జ్యోతి తన భర్త శ్రీనివాసరావుని అడిగిందని, ఇందుకు శ్రీనివాసరావు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. యశ్వంత్ ని ఇంటికి పిలిచి ముగ్గురూ కలిసి స్కూటీపై నగర శివారు బాటసింగారం దగ్గరికి వెళ్లారని, కొత్తగూడ వంతెన వద్దకు చేరుకుని నిర్మానుష్య ప్రదేశంలో శ్రీనివాసరావు మద్యం సేవించాడని తెలిపారు.

అదే సమయంలో యశ్వంత్, జ్యోతిలు శారీరకంగా కలిసేందుకి పక్కకి వెళ్లారు. ఒంటి మీదున్న దుస్తులు తీసేసి ఇద్దరూ నగ్నంగా ఉన్నారు. అదను చూసి శ్రీనివాసరావు ఇద్దరిపైనా దాడి చేశాడు. యశ్వంత్, జ్యోతిల తలపై సుత్తితో బలంగా దాడి చేశాడు. యశ్వంత్ మర్మాంగాలపైనా దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి శ్రీనివాసరావు పరారయ్యాడు. తీవ్ర గాయాలతో యశ్వంత్, జోత్యిలు మృతి చెందారని పోలీసులు తెలిపారు. నిందితుడి శ్రీనివాసరావు నుంచి బైక్, స్కూటీ, దాడికి ఉపయోగించిన స్క్రూ డ్రైవర్, సుత్తి, రాళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు.

Girl Gang Rape: రేప్ కేసు ఫైల్ చేసేందుకు వెళ్తే.. దారుణానికి తెగబడ్డ పోలీసు

అబ్దుల్లాపూర్ మెట్ జంట హత్యల కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. వివాహేతర సంబంధం కారణంగా ఈ జంట హత్యలు జరిగాయని పోలీసులు తేల్చారు. వివాహిత జ్యోతి, ఆమె ప్రియుడు యశ్వంత్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటంతో వీరిద్దరిని అంతమొందించాడు జ్యోతి భర్త శ్రీనివాస్. మంగళవారం(మే 3) అబ్దుల్లాపూర్ మెట్ బ్రిడ్జి దగ్గర జ్యోతి, యశ్వంత్ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు ఇద్దరిని తీవ్రంగా హింసించి చంపినట్లు తేలింది. యశ్వంత్ ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేసి హత్య చేశారు. జ్యోతి ముఖంపై బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్య చేశారు. మృతులు ఇద్దరు వారాసిగూడకు చెందిన వారే. జ్యోతికి పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశ్వంత్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరి మధ్య గత కొన్నిరోజులుగా వివాహేతర సంబంధం నడుస్తోంది. దీంతో భర్త శ్రీనివాస్ వీరిద్దరిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు.