Girl Gang Rape: రేప్ కేసు ఫైల్ చేసేందుకు వెళ్తే.. దారుణానికి తెగబడ్డ పోలీసు

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. నలుగురి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక రేప్ కేసు ఫైల్ చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, పోలీసు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు.

Girl Gang Rape: రేప్ కేసు ఫైల్ చేసేందుకు వెళ్తే.. దారుణానికి తెగబడ్డ పోలీసు

Girl Gang Rape

Girl Gang Rape: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. నలుగురి చేతిలో అత్యాచారానికి గురైన బాలిక రేప్ కేసు ఫైల్ చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తే, పోలీసు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. గత నెల 22న నలుగురు వ్యక్తులు పదమూడేళ్ల బాలికను మాయమాటలు చెప్పి, భోపాల్ తీసుకెళ్లారు. అక్కడ బాలికపై మూడు రోజులు అత్యాచారం చేశారు. చివరకు ఎలాగోలా అక్కడ్నుంచి తప్పించుకున్న బాలిక ఇంటికి చేరుకుంది. తర్వాత తనపై అత్యాచారం జరిగిందని, నిందితులపై కేసు ఫైల్ చేసేందుకు లలిత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ బాలికకు అండగా నిలవాల్సిన స్టేషన్ హౌజ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్ఓ), చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత బాలికను చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించాడు. అక్కడ బాలికకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.

Bihar woman: భార్యను హత్య చేసినందుకు జైల్లో భర్త.. ప్రియుడితో పారిపోయిన భార్య

నలుగురు నిందితులతోపాటు పోలీసుపైనా కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ పోలీసును సస్పెండ్ చేశారు. ఈ ఘటనలో బాధ్యులైన ఐదుగురిలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు, పోలీసు పరారీలో ఉన్నారు. పోలీసు స్టేషన్‌లో బాలిక విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని పోలీస్ లైన్‌కు అటాచ్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీతోపాటు, కాంగ్రెస్ కూడా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నాయి. మహిళలకు పోలీస్ స్టేషన్లలోనే రక్షణ లేకుంటే ఎలా అని నిలదీస్తున్నాయి.