Abdullapurmet Murder: వీడిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసు మిస్టరీ

హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో మంగళవారం లభించిన జంట మృతదేహాలకు సంబంధించిన మిస్టరీ వీడింది. మృతులను పోలీసులు జ్యోతి, యశ్వంత్‌గా గుర్తించారు.

Abdullapurmet Murder: వీడిన అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసు మిస్టరీ

Abdullapurmet Murder

Abdullapurmet Murder: హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో మంగళవారం లభించిన జంట మృతదేహాలకు సంబంధించిన మిస్టరీ వీడింది. మృతులను పోలీసులు జ్యోతి, యశ్వంత్‌గా గుర్తించారు. వివాహేతర సంబంధం కారణంగా జ్యోతి భర్తే, ఇద్దరినీ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ఘటనకు సంబందించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతి-శ్రీనివాస్ భార్యాభర్తలు. జ్యోతికి కొంతకాలంగా యశ్వంత్ అనే యువకుడితో వివాహేతరం సంబంధం కొనసాగుతోంది. ఈ విషయంపై అనుమానం వచ్చిన జ్యోతి భర్త శ్రీనివాస్ ఆ విషయాన్ని నిర్ధరించుకున్నాడు. తర్వాత జ్యోతి, యశ్వంత్ తరచూ కలుసుకునే ప్రదేశాలను గుర్తించాడు.

Abdullapurmet : హైదరాబాద్ లో యువతీయువకుల మృతదేహాల కలకలం.. హత్యా? ఆత్మహత్యా?

ఆ ప్రదేశాల్లో కొందరితో కలిసి రెక్కీ కూడా నిర్వహించాడు. ఈ క్రమంలో ఈ నెల 1న సాయంత్రం, జ్యోతి-యశ్వంత్ అబ్దుల్లాపూర్‌మెట్ కొత్తగూడెం బ్రిడ్జికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా, శ్రీనివాస్ మరికొందరితో కలిసి అక్కడకు వెళ్లాడు. వాళ్లిద్దరినీ పట్టుకున్న శ్రీనివాస్, మరికొందరు వ్యక్తులు.. జ్యోతి ముందే యశ్వంత్‌ను దారుణంగా హత్య చేశారు. యశ్వంత్ మరణించాడని నిర్ధరించుకున్న తర్వాత జ్యోతిని కూడా హతమార్చారు. తర్వాత మృతదేహాలను అక్కడే పడేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో మంగళవారం అక్కడ పడి ఉన్న మృతదేహాలకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భర్త శ్రీనివాసే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. తన భార్య వివాహేతర సంబంధం కారణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పోలీసులు నేడు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.