Bandi Sanjay: తెలంగాణలోమసీదులు తవ్వుదామా? శవాలు ఉంటే మీరు తీస్కోండీ..శివలింగాలుంటే మాకు ఇవ్వండి : ఓవైసీకి బండి సంజయ్ సవాల్

కరీంనగర్ లో జరిగిన హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి చూద్దామని శవం వస్తే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి సవాల్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘లవ్ జీహాద్’అంటూ లాఠీలు విరుగుతాయ్..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: తెలంగాణలోమసీదులు తవ్వుదామా? శవాలు ఉంటే మీరు తీస్కోండీ..శివలింగాలుంటే మాకు ఇవ్వండి : ఓవైసీకి బండి సంజయ్ సవాల్

Bandi Sanjay

Bandi Sanjay: కరీంనగర్ లో జరిగిన హిందు ఏక్తా యాత్ర ర్యాలీలో బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. మసీద్ లు తవ్వితే ఆలయాలు బయటపడుతున్నాయన్నారు. తెలంగాణలో మసీద్ లు తవ్వి చూద్దామని శవాలు ఉంటే మీరు తీస్కోండి..శివలింగాలు కనిపిస్తే మాకు ఇవ్వండి అంటూ ఓవైసీకి బండి సవాల్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘లవ్ జీహాద్’అంటూ లాఠీలు విరుగుతాయ్..అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో రామరాజ్యాన్ని స్థాపించటమే మా లక్ష్యం అని అన్నారు. అంతేకాదు..తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఊర్డూ నిషేధించి మదర్సాలను శాశ్వతంగా తొలగిస్తామన్నారు బండి సంజయ్. మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారు.

తెలంగాణలో రామరాజ్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని..రాక్షసుల రాజ్యం పోవాలని..అలా రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. మైనార్టీలకు కొమ్ముకాస్తూ హిందూ సమాజాన్ని హేళన చేస్తూ..హిందూ సమాజాన్ని చులకన చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని..అటువంటివారిని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొడతాం అని బండి సంజయ్ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అన్నారు. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నామని తన సవాల్ కు వారు సిద్ధంగా ఉంటే తాము ఎప్పుడూ సిద్ధమేనని బండి సంజయ్ స్పష్టంచేశారు.

ఇకపై లవ్ జిహాదీ పేరుతో అక్కా చెళ్లెళ్లను ట్రాప్ చేస్తే ఊరుకోమన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ . లవ్ జిహాదీ అన్నోడికి లాఠీ రుచి చూపిస్తామన్నారు.పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మత మార్పిళ్లు చేస్తే మక్కెలిరగదీస్తామన్నారు. కాగా..కరీంనగర్‌లో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.