Hyderabad : బాలికకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్ రేప్
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులపై పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
Gang rape on a girl : హైదరాబాద్ లో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో బాలికకు మత్తు మందు ఇచ్చి ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన గత రాత్రి జంకమ్మ బస్తీలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు యువకులపై పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్య గావించబడింది. మహిళపై దుండగులు దారుణంగా అత్యాచారం చేసి, చంపేసినట్లుగా తెలుస్తోంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ లో ఘటన చోటు చేసుకుంది.
13 Girls Raped : 13 మంది విద్యార్ధినులపై ఉపాధ్యాయుడు అత్యాచారం..జీవిత ఖైదు విధించిన కోర్టు
సమాచారం తెలుసుకున్న మాదాపూర్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఆనవాలు సేకరిస్తున్నారు. మహిళ ఎవరు? ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎవరు ఈ ఘాతకానికి పాల్పడ్డారు? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.