KTR : రైతుబంధు రూపంలో రైతులకు రూ.73 వేల కోట్లు అందించాం : మంత్రి కేటీఆర్

జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని తెలిపారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు.

KTR : రైతుబంధు రూపంలో రైతులకు రూ.73 వేల కోట్లు అందించాం : మంత్రి కేటీఆర్

Minister KTR (3)

KTR – Rythu Bandhu : రైతుకి పెట్టుబడి అందించాలని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. రైతుబంధు రూపంలో రూ.73 వేల కోట్లు రైతులకు అందించారని తెలిపారు. రైతుల కోసం రైతు బీమా పథకం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం సంకిరెడ్డి పల్లి వద్ద 300 కోట్ల రూపాయల అంచనాతో 40 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రి యూనిక్ ఆయిల్ ఫామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్మాణంకు మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రాములు, కార్పొరేషన్ చైర్మన్ లు ఆంజనేయులు గౌడ్, రజిని సాయి చంద్, వాల్యా నాయక్ పాల్గొన్నారు. పాలమూరు జిల్లాలో నాడు మైగ్రేషన్…నేడు ఇరిగేషన్ ఉందన్నారు. పాలమూరు రైతన్నలు అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ తో పాలమూరు ముఖచిత్రం పూర్తిగా మారనుందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు వెళ్లేలా చేస్తున్నామని చెప్పారు.

Also Read : ప్రభుత్వం ఆ పని చేస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

జిల్లాలో చెరువులు, వాగులు కళకళలాడుతున్నాయని చెప్పారు. కృష్ణా జలాలు ఒడిసిపట్టి పాలమూరు బీడు భూములకు మళ్లించామని తెలిపారు. వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. వంట నూనెలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. లక్షల టన్నులు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మన ప్రజాప్రతినిధులు తమ పొలాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని వెల్లడించారు. రైతులకు నమ్మకాన్ని కలిగిస్తున్నారని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాక్టరీ జోన్ లు ఏర్పాటు : మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టరీ జోన్ లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెస్సింగ్ పరిశ్రమల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆయిల్ ఫేమ్ సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రెండున్నర లక్షల ఎకరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి ఆయిల్ ఫామ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.