MLA Seethakka: పీహెచ్‌డీ పూర్తి చేసిన ఎమ్మెల్యే సీతక్క.. డాక్టరేట్ ప్రదానం.. వీడియో

 తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క(అనసూయ) రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు. ‘‘నేను నక్సలైటుని అవుతానని నా బాల్యంలో ఎన్నడూ అనుకోలేదు. నేను నక్సలైటుగా ఉన్న సమయంలో న్యాయవాదిని అవుతానని కూడా అనుకోలేదు. నేను న్యాయవాదిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేని అవుతానని అనుకోలేదు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో పీహెచ్‌డీ పూర్తి చేస్తానని అనుకోలేదు. నన్ను ఇప్పుడు డాక్టర్ అనసూయ అని పిలవచ్చు’’ అని పేర్కొన్నారు.

MLA Seethakka: పీహెచ్‌డీ పూర్తి చేసిన ఎమ్మెల్యే సీతక్క.. డాక్టరేట్ ప్రదానం.. వీడియో

MLA Seethakka: తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సీతక్క(అనసూయ) రాజనీతి శాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు. ‘‘నేను నక్సలైటుని అవుతానని నా బాల్యంలో ఎన్నడూ అనుకోలేదు. నేను నక్సలైటుగా ఉన్న సమయంలో న్యాయవాదిని అవుతానని కూడా అనుకోలేదు. నేను న్యాయవాదిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేని అవుతానని అనుకోలేదు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో పీహెచ్‌డీ పూర్తి చేస్తానని అనుకోలేదు. నన్ను ఇప్పుడు డాక్టర్ అనసూయ అని పిలవచ్చు’’ అని పేర్కొన్నారు.

కాగా, ఎమ్మెల్యే సీతక్క ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఈ డాక్టరేట్‌ సాధించారు. ఆ వర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, మణిపూర్‌ సెంట్రల్‌ వర్సిటీ చాన్సలర్‌ ప్రొ.తిరుపతిరావు పర్యవేక్షణలో ఆమె పీహెచ్‌డీ పూర్తి చేశారు. రాజనీతిశాస్త్రంలో భాగంగా ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై ఆమె పరిశోధన పూర్తి చేశారు. ఆమె సమర్పించిన గ్రంథాన్ని పరిశీలించిన అధికారులు పీహెచ్‌డీ ఇస్తున్నట్లు తెలిపారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..