Passport : రాష్ట్రంలో పాస్పోర్టు సేవలు పునరుధ్ధరణ
తెలంగాణలో పగటిపూట లాక్డౌన్ ఎత్తివేయటంతో రేపటి నుంచి రాష్ట్రంలోని 14 పోస్టాఫీసుల్లో పాస్పోర్టు సేవలు పునరుధ్ధరిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం అధికారులు వెల్లడించారు.
Passport : తెలంగాణలో పగటిపూట లాక్డౌన్ ఎత్తివేయటంతో రేపటి నుంచి రాష్ట్రంలోని 14 పోస్టాఫీసుల్లో పాస్పోర్టు సేవలు పునరుధ్ధరిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో లాక్డౌన్ అమలు చేస్తున్నప్పటి నుంచి పాస్పోర్టు సేవలు నిలిచిపోయాయి. అత్యవసరంగా విదేశాలకు వెళ్లేవారి కోసం మాత్రం సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సేవలు అందించారు.
జూన్ 1 నుంచి రాష్ట్రంలోని ఐదు ప్రధాన పాస్పోర్టు సేవా కేంద్రాల్లో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. జూన్ 10 నుంచి పగటి పూట లాక్డౌన్ ఎత్తివేయటంతో రాష్ట్రంలోని 14 పోస్టాఫీసులతో పాటు, అన్ని పాస్పోర్టు సేవాకేంద్రాలు సాధారణ సమయాల్లో పనిచేస్తాయని అధికారులు తెలిపారు.