Adibatla Kidnap Case : 100 మందితో వచ్చి యువతి కిడ్నాప్ కేసు.. కీలక వివరాలు వెల్లడించిన పోలీసులు
యువతి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి అనే కిడ్నాపర్ తో పాటు ఇప్పటివరకు 8మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్న పోలీసులు.. మరింత మంది నేరస్తులు ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు.(Adibatla Kidnap Case)
Adibatla Kidnap Case రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఆదిభట్లలో యువతి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. కిడ్నాప్ అయిన యువతి సేఫ్ గా ఉంది. పోలీసులు వైశాలిని కాపాడారు. ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చారు.
కాగా, 10 గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసుని చేధించారు. కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డి అనే కిడ్నాపర్ తో పాటు ఇప్పటివరకు 8మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందన్న పోలీసులు.. మరింత మంది నేరస్తులు ఉన్నారని, వారందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు.
కాగా, యువతిని కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చిన పోలీసులకు యువతి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. యువతి ప్రస్తుతం డీప్ షాక్ లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కిడ్నాపర్ నవీన్ రెడ్డి.. యువతిని బాగా భయబ్రాంతులకు గురి చేశాడని పోలీసులు వెల్లడించారు. యువతిని కిడ్నాప్ చేశాక ఆమెపై దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. యువతిని కాపాడి సేఫ్ గా ఇంటికి చేర్చడమే తమ మొదటి లక్ష్యం అన్న పోలీసులు.. అందులో తాము సక్సెస్ అయ్యామన్నారు.(Adibatla Kidnap Case)
అసలేం జరిగిందంటే..
రాగన్నగూడకు చెందిన వైశాలి బీడీఎస్ పూర్తి చేసింది. ఆమెకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా.. నవీన్ రెడ్డి అనే యువకుడు వందమంది యువకులతో కలిసి వైశాలి ఇంటికి వచ్చి దాడి చేశాడు. అనంతరం వైశాలిని బలవంతంగా లాక్కెళ్లాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read..100 Gang Kidnapped Woman : 100మందితో వచ్చి సినిమా స్టైల్లో యువతిని కిడ్నాప్..
సినిమా స్టైల్ లో ఈ కిడ్నాప్ జరిగింది. యువతి ఇంటిపై 100 మంది యువకులు దాడి చేశారు. అడ్డు వచ్చిన యువతి తల్లిదండ్రులను, చుట్టు పక్కల వారిని చితకబాదారు. యువతి ఇంటిని ధ్వంసం చేసి, ఆ యువతిని ఎత్తుకెళ్లారు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతలోపే యువకులు అక్కడి నుంచి పరార్ అయ్యారు.
నవీన్ రెడ్డి.. వైశాలిని ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు. ఐదారు నెలలుగా ఆ యువతిని ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నట్లు చెబుతున్నారు. మధ్యవర్తుల ద్వారా కూడా యువతి తల్లిదండ్రులను పెళ్లి సంబంధం గురించి అడిగించినట్లు స్థానికులు చెబుతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం ఈ సంబంధం తమకు ఇష్టం లేదని చెప్పినట్లు సమాచారం. ఇది మనసులో పెట్టుకుని నవీన్ ఈ కిడ్నాప్కు ప్లాన్ చేసినట్లు యువతి తల్లిదండ్రులు ఆరోపించారు.
పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్న నవీన్.. కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లు యువతి కుటుంబసభ్యులు చెబుతున్నారు. తమ కూతురును నవీన్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడని షీ టీమ్కు కూడా ఫిర్యాదు చేసినట్లు యువతి తండ్రి తెలిపారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
శుక్రవారం యువతిని చూసేందుకు పెళ్లి వారు వస్తున్నారన్న విషయం నవీన్ రెడ్డికి తెలిసింది. దీంతో ఈ పెళ్లి సంబంధం చెడగొట్టాలనే అక్కసుతో ఏకంగా 100 మంది యువకులను నవీన్ రెడ్డి వెంటేసుకుని వచ్చాడని యువతి తల్లిదండ్రులు చెబుతున్నారు. యువతి ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను ధ్వంసం చేశారు. అనంతరం ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన తల్లిదండ్రులు, ఇరుగుపొరుగు వారిపై కూడా దాడి చేసి బీభత్సం సృష్టించారు.