Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 779 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 132 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 536గా ఉంది.

Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

Updated On : October 13, 2022 / 6:17 AM IST

Telangana Covid News : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 9వేల 826 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 83 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 43 కేసులు వచ్చాయి. మెదక్ జిల్లాలో 3 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 3 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 3 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 61 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 38వేల 779 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 34వేల 132 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 536గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 10వేల 403 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 85 మందికి పాజిటివ్ గా తేలింది.

తెలంగాణ కరోనా బులెటిన్..