చిలుకూరులో శివలింగం పక్కనే తాబేలు..కరోనా అంతమౌతుందా

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 07:39 AM IST
చిలుకూరులో శివలింగం పక్కనే తాబేలు..కరోనా అంతమౌతుందా

తెలంగాణ తిరుమలగా గుర్తింపు పొందిన చిలుకూరు బాలాజీ ఆలయంలో అద్భుతం సంభవించింది. ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో శివలింగం పక్కనే తాబేలు దర్శనం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు తాబేలు ఎలా లోపలకు వచ్చింది. శివలింగం పక్కనే ఎందుకు ఉంది అని చర్చించుకుంటున్నారు.

ఇదొక అద్బుతం..శుభసూచకమంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ అంతమొందుతుందని అంటున్నారు. పది సెంటీమీటర్ల పొడవు, ఆరు సెంటీమీటర్ల వెడల్పు ఉంని, కానీ శివాలయంలోకి ఎలా వచ్చిందో అంతుబట్టడం లేదని ఆలయ అర్చకుడు సీఎస్ రంగరాజన్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..సత్ఫలితాలు ఇవ్వడం లేదు.

మరణాలు సంభవిస్తుండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మొయినాబాద్ లో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మూసివేసి..స్వామి వారికి ఏకాంత పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాబేలు ప్రత్యక్షం కావడం శుభప్రదమని అంటున్నారు.