MLC Kavitha Respond : సీబీఐ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 కింద తనకు సీబీఐ నోటీసు జారీ చేశారని తెలిపారు.

MLC Kavitha Respond : సీబీఐ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత

Kavitha responded

MLC Kavitha Respond : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటిసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సీబీఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 కింద తనకు సీబీఐ నోటీసు జారీ చేశారని తెలిపారు. వారి అభ్యర్థన మేరకు డిసెంబర్6వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశానని పేర్కొన్నారు. కేవలం వివరణ కోసమే నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ స్పష్టం చేసింది. 160 సీఆర్పీసీ కింద వివరణ ఇవ్వాలని సీబీఐ నోటీస్ ఇచ్చింది. ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఎక్కడ హాజరు అయినా పర్వాలేదని నోటీసుల్లో పేర్కొంది.

ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులో సీబీఐ కవిత పేరును చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న హైదరాబాద్ లో సీబీఐ విచారణకు కవిత హాజరవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో అరెస్టు అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును సీబీఐ పొందుపర్చింది. దీంతో కేసులో కవిత పాత్ర ఏంటనే అంశంపై విచారణ చేసేందుకు ఆమెకు నోటీసులు ఇచ్చింది.

CBI Notices MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. అమిత్ అరోరా రిమాండు రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారి పేర్లను పేర్కొంది. లిక్కర్స్ స్కాం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అమిత్ అరోరాని ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్ గా శరత్ చంద్ర, కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.

అమిత్ ఆరోరా ఫోన్ కాల్ డేటాలో కవిత ఫోన్ నెంబర్ ఉందని, ఆరోరాతో కవిత పలు సార్లు మాట్లాడారని అమిత్ ఆరోరా తన ఫోన్ నుంచి కవితకు 10 సార్లు కాల్ చేసినట్లు ఈడీ పేర్కొంది. నిన్న అమిత్ అరోరాను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగానే రిపోర్టు దాఖలు చేయగా అందులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు తెలిసింది.