Yadadri Mini Buses : ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు

మినీ బస్సులను టీఎస్ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

Yadadri Mini Buses : ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు

Yadadri Mini Bus

TSRTC special mini buses : హైదరాబాద్ ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండపైకి యాదాద్రి దర్శిని పేరుతో ప్రత్యేక మినీ బస్సులను ఏర్పాటు చేశారు. మినీ బస్సులను టీఎస్ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ యాదగిరిగుట్టకు 100 మినీ బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రం, హైదరాబాద్ ఉప్పల్ సర్కిల్ నుండి మినీ బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. జెబిఎస్ నుండి 100 రూపాయలు, ఉప్పల్ నుండి 75 రూపాయలు ఛార్జీ ఉంటుందని వెల్లడించారు.

Yadadri Break Darshans : యాదాద్రిలో కూడా తిరుమల మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు

ప్రతి రోజు 104 సర్వీసులు అందుబాటులో ఉంటాయని, ఇవే కాకుండా ఇతర జిల్లాల నుండి ప్రత్యేక యాదాద్రి బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వాహనాలకంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సుఖవంతంగా ఉంటుందని చెప్పారు. కొంత మంది ఉద్యోగులు వీఆర్ఎస్ కోరుకుంటున్నారని తెలిపారు.

బలవంతంగా తాము వీఆర్ఎస్ ఇవ్వటం లేదని స్పష్టం చేశారు. మొన్న ఫీల్డ్ విసిట్ చేసినప్పుడు 2000 మంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అన్నారని తెలిపారు. అందుకే వారు వాలంటరీ రిటైర్డ్ కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇంకా ఎంత మంది వస్తారో చూసి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.

Yadadri : యాదాద్రికి ప్రత్యేక పాలక మండలి

పెరిగిన సెస్ చార్జీలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదు ఇవి సెస్ చార్జీలు మాత్రమేనని తెలిపారు. టోల్ ప్లాజా డబ్బులు టిఎస్ ఆర్టీసీ చెల్లిస్తుందన్నారు. ఏటా రూ.70 నుండి 100 కోట్ల వరకు ఆర్టీసీ నష్టపోతుందని తెలిపారు. ఆర్టీసీ లాభాల కోసమే చార్జీల పెంపు అని స్పష్టం చేశారు. ఇంత చేసినా రోజూ 6 కోట్ల రూపాయలు నష్టపోతున్నామని తెలిపారు. కొత్త బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.