Yadadri : యాదాద్రికి ప్రత్యేక పాలక మండలి
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రభుత్వం యాదాద్రికి ప్రత్యేక ఆలయ మండలిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ పరిపాలనా విధానం మారనుంది. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రభుత్వం యాదాద్రికి ప్రత్యేక ఆలయ మండలిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆలయ నిర్వహణ బాధ్యతలు దేవాదాయశాఖతోపాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చూస్తోంది. ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్ అధికారిని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.