Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

మారుతున్న కాలానుగుణంగా   వ్యవసాయం  అనుబంధ రంగాలను ఎన్నుకొని వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు , వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపకరిస్తాయి.

Mixed Farming : ఒకే పంట విధానం కన్నా మిశ్రమ వ్యవసాయంతో అధిక లాభాలు..

Mixed Farming

Mixed Farming : తల్లి భూదేవి చల్లగా చూస్తే అన్నం ముద్దకు కరువే లేదని రైతు ఆత్మవిశ్వాసంతో ప్రకటించే పరిస్ధితి ఒకనాడు ఉండేది. ఇది గతం. ఇప్పుడు నాలుగెదైకరాలున్న సన్నకారు రైతుల నుంచి, పదుల ఎకరాల మోతుబరులు సైతం సాగులో తగిలిన దెబ్బలకు నవనాడులు కుంగిపోయి, జవసత్వాలు కూడగట్టుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు. వ్యవసాయం వ్యాపారంగా మారింది. ఒక వైపు వ్యాపారుల మాయాజాలం, మరో వైపు రైతులు ప్రకృతి కొట్టిన దెబ్బలకు కుంగిపోతున్నారు. లాభాల సంగతి దేవుడెరుగు బతుకు గడిస్తే చాలనుకునే పరిస్ధితి నెలకొంది. ఈ పరస్థితుల నుండి గట్టెక్కాలంటే మిశ్రమ వ్యవసాయం చేయక తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

READ ALSO : Eat Eggs : కోడిగుడ్లు రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?

మన్ను నుంచి అన్నం తీసిన చేతులు మట్టి పనులు చేయడానికి వలసబాట పట్టాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి.. వ్యవసాయ రంగాన్ని ఎక్కి ఏలుతున్న ఆధునికత ధాటికి సాగు  నిలువునా కూలిపోతుంది. వ్యవసాయం ప్రధాన, అనుబంధ రంగాల మేలుకలయికగా కలిసి నడిచిననాడు కూడుకు, గుడ్డకు లోటు ఉండేది కాదు.  మార్కెట్ లక్ష్యంగా సాగు మొదలు పెట్టిన నాటి నుంచే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి.

READ ALSO : స్మార్ట్ సేద్యం.. యాప్ సాయంతో పంటలు… నూజివీడు త్రిపుల్ ఐటీ విద్యార్థుల ఘనత

ఒకప్పుడు  రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంపకం చేపట్టి ఖచ్చితమూన ఆదాయాన్ని పొందేవారు. అయితే వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేస్తున్నారు. అంతే కాకుండా ఒకే పంటను సాగుచేస్తూ నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంతగా కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా కావటంతో ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు.  వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అవసంరం.

READ ALSO : Karanam Venkatesh : నోరుజారితే అంతు చూస్తా, చీరాల ఎమ్మెల్యేగా గెలుస్తా- కరణం వెంకటేశ్ హాట్ కామెంట్స్

మారుతున్న కాలానుగుణంగా   వ్యవసాయం  అనుబంధ రంగాలను ఎన్నుకొని వ్యవసాయం చేపట్టాలి. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు , వ్వర్ధాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపకరిస్తాయి. అంతే  ఒకటి కాకపోయిన ఒక దాంట్లోనైనా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

READ ALSO : Castor Cultivation : ఖరీఫ్ కు అనువైన ఆముదం రకాలు

మిశ్రమ వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు. వ్యవసాయ వ్యర్ధాల వినియోగంతో సాగు ఖర్చు తగ్గుతుంది. పశుగ్రాసాల కొరత ఉండదు. పశుపోషణ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. భూసార, పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత చేకూరుతుంది.