వినుకొండలో నడిరోడ్డుపై అతి దారుణం.. 144 సెక్షన్ అమలు

144 Section in Vinukonda: వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జీలాని అనే వ్యక్తి రోడ్డుపై హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

వినుకొండలో నడిరోడ్డుపై అతి దారుణం.. 144 సెక్షన్ అమలు

పల్నాడు జిల్లా నరసరావుపేట వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై హత్యచేశాడు జిలానీ అనే యువకుడు. దీంతో పోలీసులు జిలానీని అదుపులోకి తీసుకున్నారు. వినుకొండలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. రషీద్‌ను నడిరోడ్డుపై హత్యచేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ హత్యపై పల్నాడు జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ… వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని జీలాని అనే వ్యక్తి రోడ్డుపై హత్య చేశాడని తెలిపారు. ఇద్దరికి వ్యక్తిగత ఘర్షణల కారణంగానే హత్య జరిగిందని చెప్పారు. రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు.

పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని అన్నారు. కాగా, రషీద్ వినుకొండ వైసీపీ యువజన విభాగం నాయకుడని వైసీపీ చెబుతోంది. జిలానీ టీడీపీకి చెందిన వ్యక్తని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది. వినుకొండలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Also Read: షార్ట్ వీడియోల పిచ్చి.. కారు డ్రైవ్ చేస్తూ డ్యాన్స్..