టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.

జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు.
జగన్ పాలనపై ఏపీ బీజేపీ నేతలు విమర్శలు చేశారు. జగన్ 6 నెలల పాలనకు, చంద్రబాబు ఐదేళ్ల పాలనకు తేడా లేదన్నారు. ఈ మేరకు శుక్రవారం (నవంబర్29, 2019) ఢిల్లీలో నేతలు మీడియాతో మాట్లాడుతూ 6 నెలల్లో ఆదాయం రూ.69 వేల కోట్లు, అప్పులు రూ.30 వేల కోట్లుగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వం ఏపీ అప్పులను రూ.3.40 లక్షల కోట్లకు చేర్చిందన్నారు. 6 నెలల్లో రూ.56 వేల కోట్ల ఉచిత పథకాలు ప్రకటించారని చెప్పారు.
ఆరు నెలల పాటు అమరావతి, ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. పోలీసుల అండతో వైసీపీ నేతలు దర్మార్గాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దేవుడి భూములను అన్యాక్రాంతం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధ ఇసుక మీద లేదని విమర్శించారు. భవిష్యత్ లో టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుందన్నారు.
ఆరు నెలల కాలంలో రాజకీయాలు, వ్యక్తిగత దూషణలు చేయడంతో సరిపోయిందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. అమరావతి పనులను ఆరు నెలలు ఆపి..మరలా మొదలు పెట్టాలని చెప్పినట్లు తెలుస్తోందని, ఇందులో అవతవకలు జరిగితే..కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్య ధోరణితో చేయడం సరికాదన్నారు.
పారిశ్రామిక వేత్తలు వచ్చి..కంపెనీలు పెట్టకపోతే..యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. విజన్ స్టేట్ మెంట్స్తో బాబు..ఐదు సంవత్సరాలు గడిపేశారన్న ఆయన..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సపోర్టుతో వచ్చిన కంపెనీలు పారిపోయారని..దీనిపై సమాధానం చెప్పాలని సూచించారు. ఇసుకపై కొత్త పాలసీ ఎందుకు తీసుకొచ్చారో తెలియడం లేదన్నారు.
రివర్స్ టెండరింగ్ అన్ని చేస్తున్నామని చెప్పినా..ఏవీ మొదలు కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జలశక్తి మంత్రి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిధులు ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నించారు. ఇంగ్లీషు మీడియం అవసరమే..కానీ సరైన స్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా నిర్బంధంగా పెట్టడం సమంజసం కాదన్నారు.