ఏపీలో తగ్గిన కరోనా మరణాలు.. స్వల్పంగా పెరిగిన కేసులు

  • Published By: sreehari ,Published On : December 9, 2020 / 09:08 PM IST
ఏపీలో తగ్గిన కరోనా మరణాలు.. స్వల్పంగా పెరిగిన కేసులు

Updated On : December 9, 2020 / 9:47 PM IST

AP Covid-19 positive Cases : ఏపీలో కరోనా వైరస్ మరణాల సంఖ్య భారీగా తగ్గింది. కరోనా కేసులు కూడా రోజురోజుకీ క్రమంగా తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.



ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 61,038 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.



వారిలో కొత్తగా 618 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,73,457లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి ముగ్గురు మరణించారు.



785 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా పరీక్షలను 1,05,70,843 పరీక్షించినట్టు ఏపీ ప్రభుత్వం బులెటిన్ లో వెల్లడించింది.



రాష్ట్రంలో మొత్తంగా 84,8511 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 99,62,416 మందికి శాంపిల్స్ పరీక్షించగా 11,571 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 6981కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, విశాఖపట్నంలో ఒకరు మరణించారు.