ఏపీలో అందరికీ ఇళ్లు స్కీమ్.. రూల్స్ ఇవే.. మీకు వస్తుందో రాదో చెక్ చేసుకోండి..
రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

House For All : ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకాల్లో ఒకటి అందరికీ ఇళ్లు. ఈ స్కీమ్ పేరుతో ప్రభుత్వం జీవో జారీ చేసింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మహిళల పేరుతో ఇవ్వనుంది సర్కార్. ఏజెన్సీల ద్వారా ఇళ్లు నిర్మించనుంది. స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత హక్కులు లభించనున్నాయి.
ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలం పొందేందుకు అర్హులు. ఆధార్, రేషన్ కార్డుకు ప్లాట్ అనుసంధానం చేయనుంది ప్రభుత్వం. రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అందరికీ ఇళ్లు స్కీమ్ కి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ స్కీమ్ కి ఎవరెవరు అర్హులు, లబ్దిదారులను ఎలా ఎంపిక చేస్తారు తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టత నిచ్చింది.
Also Read : డిప్యూటీ సీఎం తీసుకుంటారా? నారా లోకేష్ వన్ వర్డ్ ఆన్సర్ ఇదే..
మార్గదర్శకాలు ఇవే..
* పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం ఉన్న చోట 2 సెంట్ల చొప్పున కేటాయిస్తారు. అదీ ఆ ఇంటి మహిళ పేరుతోనే..
* పట్టణాల్లో ప్రభుత్వ భూములు లేని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం..
* ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి దానిపై పూర్తి హక్కులు.. కేటాయించిన నాటి నుంచి పదేళ్ల తర్వాతే లభిస్తాయి
* జీవితంలో ఒకసారి మాత్రమే ఇంటి స్థలం లేదా ఇల్లు పొందడానికి అర్హుడు
* పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా లబ్దిదారు ఇంటిని నిర్మించుకోవాలి..
* డూప్లికేషన్ లేకుండా ప్లాట్ ను ఆధార్, రేషన్ కార్డులకు లింక్ చేస్తారు..
ఎవరెవరు అర్హులు అంటే..
* తెల్లరేషన్ కార్డుదారులు
* రాష్ట్రంలో ఎక్కడా కూడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎలాంటి ఇంటి స్ధలం పొందని వారు మాత్రమే అర్హులు
* కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో లబ్దిపొంది ఉండకూడదు
* 5 ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులు
* ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసుల్లో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి మరో చోట కేటాయింపు
* గతంలో కేటాయించిన లే ఔట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే ఔట్ ను రద్దు చేసి వేరే చోట కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
* ఇప్పటికే ఇంటి స్థలం పొందినా ఇల్లు నిర్మించని వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం..
Also Read : సుప్రీంకోర్టులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఊరట.. పిటిషన్ కొట్టివేత
దరఖాస్తు ఇక్కడ, ఇలా చేసుకోవాలి.. లబ్దిదారులను ఇలా ఎంపిక చేస్తారు..
* గ్రామ, వార్డు స్ధాయిలో ధరఖాస్తు చేసుకోవాలి
* వీఆర్వో, ఆర్ఐల ద్వారా విచారణ
* గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శన, అభ్యంతరాలు స్వీకరణ
* తుది జాబితాను ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్లకు పంపాలి
* లబ్దిదారుల గ్రామాల్లో భూమి లభ్యత లేకపోతే పక్క గ్రామల్లో భూమి స్ధలం కేటాయింపునకు కలెక్టర్కు అధికారం
* నిబంధనలకు వ్యతిరేకంగా పట్టా పొందినట్టు తెలిస్తే వెంటనే రద్దు చేయాలని నిర్ణయం