విజయనగరం రైల్వే స్టేషన్లో బాంబు కలకలం
విజయనగరం రైల్వే స్టేషన్లో అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రైల్వే
విజయనగరం రైల్వే స్టేషన్లో అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు రైల్వే
విజయనగరం రైల్వే స్టేషన్లో ఆదివారం (ఫిబ్రవరి 02,2020) అర్థరాత్రి బాంబు కలకలం చెలరేగింది. రైల్వే స్టేషన్ లో బాంబు ఉందంటూ ఓ అగంతకుడు పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు రైల్వే స్టేషన్ కు వచ్చారు. స్టేషన్ మొత్తం తనిఖీలు చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ లతో రైల్వేస్టేషన్ ను అనువణువు గాలించారు. చివరికి ఎక్కడా బాంబు దొరకకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఫేక్ కాల్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు తీశారనే వివరాలు తెలుకునే పనిలో పడ్డారు. కాగా, ఒక్కసారిగా పోలీసులు హడావుడి చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బాంబు ఉందనే వార్తలతో కంగారుపడ్డారు. చివరికి ఏమీ లేదని తెలిసి రిలాక్స్ అయ్యారు.