CM Jagan Kadapa Tour: రేపటి నుంచి మూడు రోజులు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. టూర్ వివరాలివే..
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1నుంచి 3వ తేదీ వరకు సీఎం జగన్ పర్యటన జిల్లాలో సాగనుంది.
CM Jagan Kadapa Tour: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1నుంచి 3వ తేదీ వరకు సీఎం జగన్ పర్యటన జిల్లాలో సాగనుంది. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 2గంటలకు సీఎం జగన్ తన నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో 2.30 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్ పోర్టు కు చేరుకుంటారు. 3.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ 4.05 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు. 4.10 గంటల నుంచి సాయంత్రం 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయం కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాప్టర్ ద్వారా వేంపల్లె మండలంలోని ఇడుపుల పాయ గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.
2వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపుల పాయలోని వైఎస్ఆర్ గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9గంటలకు వైఎస్సార్ ఘాట్ కు చేరుకుంటారు. 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సీఎం జగన్ సమీక్షిస్తారు. సాయంత్రం 5.10 గంటలకు గెస్ట్ హౌస్ కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.
3వ తేదీ ఉదయం 8.50 గంటలకు ఇడుపుల పాయ ఎస్టేట్ లోని గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి అక్కడే ఉన్న హెలిప్యాడ్ వద్దకు 9గంటలకు సీఎం వై.ఎస్. జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి 9.15 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొని తన నివాసానికి బయలుదేరి వెళ్తారు.