ఏపీ మున్సిపల్ శాఖ ఔట్సోర్సింగ్ వర్కర్లకు గుడ్న్యూస్.. జీతాలు పెరిగాయ్.. ఎంతంటే?
మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల జీతాలను పెంచుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్లుగా పనిచేస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారి జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేటగిరి-1, కేటగిరీ-2, కేటగిరీ-3 వర్కర్ల వేతనం పెరిగింది.
మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్ నాన్ పీహెచ్ వర్కర్ల జీతాలను పెంచుతూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు.
పెరిగిన జీతాలు ఈ విధంగా..
- కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి రూ.24,500కు పెంపు
- కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కు పెంపు
- కేటగిరీ-3 వర్కర్ల వేతనం రూ.15 వేల నుంచి రూ.18,500కు పెంపు