కోవిడ్ నివారణ చర్యల్లో మరో కీలక అడుగు…రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10కి పెంపు

ఏపీలో కోవిడ్ నివారణ చర్యల్లో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆస్పత్రుల సంఖ్య 5 నుంచి 10 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సేవలకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలన్న దానిపై 2 రోజులు నివేదిక తయారీ చేయనున్నట్లు వెల్లడించారు. 5 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవలకోసం సత్వర చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని సీఎం ఆదేశించారు.
కోవిడ్ సోకిందన్న అనుమానం వస్తే ఏం చేయాలి?ఎవన్ని కలవాలన్న దానిపై అవగాహనకు భారీ ప్రచారం చేయాలన్నారు. కోవిడ్ ఎవరికైనా వస్తుంది, ఆందోళన చెందవద్దన్నారు. 85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటే నయం అవుతుందన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడేవాళ్లు, వయసులో పెద్దవాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం చేయవద్దన్నారు.