Nara Lokesh: ఏపీని సందర్శించండి.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేశ్ భేటీ
సత్యనాదెళ్లతో భేటీ అనంతరం లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఐటీ హబ్ లు, ఇన్నోవేషన్ పార్కులు నిర్మిస్తున్నామని, ఐటీ హబ్ లను ప్రపంచ స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో ..

Nara Lokesh with Satyanadella
Nara Lokesh meets Satyam Nadella : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా మైక్రోసాప్ట్ కేంద్ర కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఐటీ, నైపుణ్యాభివృద్ధి అంశాలతో నాదెళ్లతో లోకేశ్ చర్చించారు. రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించాలని, అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. అదేవిధంగా ఏపీని సందర్శించాలని సత్యం నాదెళ్లను లోకేశ్ ఆహ్వానించారు. సత్యనాదెళ్లతో భేటీకి సంబంధించిన ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో లోకేశ్ ఫోస్టు చేశారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కేంద్ర కార్యాలయంలోని తెలుగు ఉద్యోగులను కలిసిన నారా లోకేశ్.. వారితో కరచాలనం చేసి ఫొటోలు దిగారు.
Also Read: ఏపీలో వాలంటీర్ల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఏం జరుగుతోంది?
అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. నాల్గోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నారని, ఈ హబ్లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని సత్యనాదెళ్లను కోరడం జరిగిందని అన్నారు. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి మావద్ద అందుబాటులో ఉంది. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి పనిచేద్దామని ప్రతిపాదించానునని లోకేశ్ తెలిపారు. అదేవిధంగా.. ఏపీలో ఐటి, ఇంజనీరింగ్ టాలెంట్ పై దృష్టి సారించాలని కోరడం జరిగిందని లోకేశ్ తెలిపారు..
ఏపీలో అగ్రిటెక్కు ఎఐని అనుసంధానించడం వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, మైక్రోసాఫ్ట్ సాంకేతిక నైపుణ్యంతో ఉత్పాదకతను పెంచే వ్యవసాయ విధానాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని తెలిపాను. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా స్ట్రీమ్లైన్డ్ అప్రూవల్స్, ఫాస్ట్-ట్రాక్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రో-బిజినెస్ పాలసీలతోపాటు మంచి ఎకో సిస్టం ఉందని వివరించాను. క్లౌడ్-ఆధారిత ప్లాట్ఫాంలను అమలు చేయడం, డేటా అనలిటిక్స్ కోసం ఎఐని ఉపయోగించడం, సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడం, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరించే డిజిటల్ గవర్నెన్స్ విధానాలకు మైక్రో సాఫ్ట్ సహకారాన్ని కోరాను. అమరావతిని ఎఐ క్యాపిటల్ గా తయారు చేసేందుకు ఎఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నామని, దీనికి మైక్రోసాఫ్ట్ సహకారం కావాలని ఏపీ ప్రభుత్వం కోరుకుంటోందని సత్య నాదెళ్లకు చెప్పడం జరిగిందని, అయితే, ఏపీలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్, ఏఐ రంగాల అభివృద్ధికి సహకరిస్తామని సత్య నాదెళ్ల మాట ఇచ్చారని లోకేశ్ తెలిపారు.
Also Read: వందల కోట్ల రూపాయలు స్వాహా? సర్వే రాళ్లలో గోల్మాల్పై ఏసీబీ విచారణ..!
Had an insightful meeting with @satyanadella, CEO of @Microsoft. Sought his valuable guidance and support in advancing IT, AI, and skill development in Andhra Pradesh. Looking forward to collaborative efforts to drive digital transformation and opportunities in the state.… pic.twitter.com/8fmHhIGtIN
— Lokesh Nara (@naralokesh) October 29, 2024