ఏపీలో కూటమిదే జయకేతనం..! పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సంచలన రిపోర్ట్
ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా 52 శాతం మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, 41 శాతం మంది వైసీపీ అని చెప్పారు

People Pulse Exit Polls On Ap (Photo Credit : Google)
Peoples Pulse Exit Polls : ఏపీ ఎన్నికల్లో గెలిచే పార్టీ ఏది? అన్నదానిపై పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసింది. ఏపీలో టీడీపీ కూటమికి పట్టం కట్టింది పీపుల్స్ పల్స్. టీడీపీ కూటమి అధికారంలోకి రానుందని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీకి 95-110, జనసేనకు 14-20, బీజేపీకి 2-5 సీట్లు, వైసీపీకి 45- 65 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
* టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 52 శాతం, వైసీపీకి 44 శాతం, కాంగ్రెస్ కి 1 శాతం, ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చే అవకాశం
* ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ 13-15, జనసేన 2, బీజేపీ 2- 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం
* వైసీపీ 3-5 పార్లమెంటు స్థానాలను గెలిచే అవకాశం
* టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 50-54%, వైసీపీకి 42-45%, కాంగ్రెస్ కి 1- 2%, ఇతరులకు 3-4% ఓట్లు వచ్చే అవకాశం
* టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి 111-135 అసెంబ్లీ స్థానాలను గెలుపొందే అవకాశం
* వైసీపీ 45-60 స్థానాలు గెలుపొందే అవకాశం
* ఏపీలో గత ఐదేళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల 48 శాతం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయగా 32 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు
* వైసీపీకి మరొకసారి అవకాశం ఇస్తారా అని అడగ్గా 51 శాతం మంది ఇవ్వమని, 42 శాతం మంది ఇస్తామని చెప్పారు
* ఈ ఎన్నికల తర్వాత ప్రస్తుత సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని 38 శాతం, చంద్రబాబు కావాలని 40 శాతం మంది, పవన్ కళ్యాణ్ కావాలని 12 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు
* ప్రధానమంత్రి ఎవరు కావాలని అడిగినప్పుడు నరేంద్రమోదీకి 48 శాతం, రాహుల్ గాంధీకి 38 శాతం మంది మద్దతు తెలిపారు
*ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని వ్యక్తిగత అభిప్రాయం కింద అడిగినప్పుడు 54శాతం మంది కూటమి వైపు, 44శాతం వైసీపీ వైపు నిలబడ్డారు
* ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా 52 శాతం మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, 41 శాతం మంది వైసీపీ అని చెప్పారు
* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సంస్థ మే 16 నుంచి 20 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో భాగంగా 6,900 శాంపిల్స్ సేకరించింది.
Also Read : ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?