ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారు: పేర్ని నాని, కొడాలి నాని

Perni Nani: నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు.

ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారు: పేర్ని నాని, కొడాలి నాని

Kodali Nani: వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నారని మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని అన్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని నివాసంలో ఇవాళ పలువురు వైసీపీ నేతలు సమావేశమై కార్యకర్తల మీద జరుగుతున్న దాడులపై చర్చించారు.

ఈ సందర్భంగా పేర్ని నాని, కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగు రోజుల నుంచి జిల్లాలో టీడీపీ దాడులకు పాల్పడుతోందని తెలిపారు. స్వయంగా పోలీసుల సమక్షంలోనే టీడీపీ వాళ్లు దాడులకు తెగబడుతున్నారని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం లేదని అన్నారు.

రెండు రోజుల్లో కృష్ణ జిల్లా ఎస్పీని కలుస్తామని తెలిపారు. జిల్లా వైఎస్సార్సీపీ మాజీ శాసన సభ్యులు అందరం కలిసి పూర్తి వివరాలు అందచేసి రక్షణ కోరతామని అన్నారు. పోలీసుల తీరు ఇలాగే ఉంటే తాము హైకోర్టులో ప్రైవైట్ కేసు వేసి న్యాయ పరంగా ముందుకు వెళతామని చెప్పారు.

కాగా, టీడీపీ దాడులు చేస్తోందంటూ ఇప్పటికే వైసీపీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. దాడులకు తెగబడిన వారిపై చర్యలు తీసుకోవాలని, మరోసారి దాడులు జరగకుండా చూడాలని వారు కోరారు.

Also Read: ఎపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పదవికి పూనూరి గౌతంరెడ్డి రాజీనామా.. కారణ ఏమిటంటే?