టీడీపీకి ఓటు వేస్తే వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుంది: పోసాని కృష్ణమురళి

పవన్ కల్యాణ్ మాటలు నమ్మి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తు వంగవీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందని పోసాని కృష్ణమురళి అన్నారు.

టీడీపీకి ఓటు వేస్తే వంగవీటి రంగా ఆత్మ క్షోభిస్తుంది: పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali : పవన్ కల్యాణ్ మాటలు నమ్మి సైకిల్ గుర్తుకు ఓటు వేస్తు వంగవీటి మోహన్ రంగా ఆత్మ క్షోభిస్తుందని APFDC చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రంగాను నిజంగా ప్రేమిస్తే చంద్రబాబుకు ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. టీడీపీకి ఓటు వేయకపోడమే రంగాకు ఇచ్చే నిజమైన నివాళి అంటూ వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల్లో కాపులను మరోసారి మోసం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. రంగాను చంద్రబాబు నాయుడు చంపించారని మరోసారి ఆరోపించారు.

”ఎన్టీఆర్ కంటే గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా. అల్లూరి సీతారామరాజును ఎలా పిరికి పందల్లా చంపారో అలా రంగాను చంపారు. ఆయన ఇప్పుడు ఉండివుంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేవారని కాపు సోదరులు అనుకుంటున్న తరుణంలో తెరపైకి పవన్ కల్యాణ్ వచ్చాడు. నేను ఉన్నాను అన్నాడు. కాపు సోదరుల దగ్గరకు వెళ్లి నేను పార్టీ పెట్టాను అన్నాడు. నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నాడు. మీకు నాకు అండగా ఉంటే అని.. చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణను పవన్ కల్యాణ్ తిట్టని తిట్లు లేవు. పచ్చి బూతులు తిట్లాడు. కాపు సోదరులు నమ్మారు. క్లాప్స్ కొట్టారు. అంతా యూనిటిగా ఉండండి.. నేను ముఖ్యమంత్రి అవుతానంటే ఈలలు వేశారు.

ఇప్పుడు వారాహి మీద దిగాడు. అందరూ యూనిటిగా ఉండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలన్నాడు. తనకు సీఎం అయ్యేంత సీను లేదని అన్నాడు. పవన్ మాటలతో కాపుల మనోభావాలు ఎలావుంటాయో ఒకసారి ఆలోచించండి. కాపులకు అండగా పవన్ కల్యాణ్ ఉంటాడనుకున్నాను. కానీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఆయన చూస్తున్నాడు. కాపులంతా చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయాలి, రంగా గారిని చంపినందుకా? ముఖ్యమంత్రి అయ్యేవాళ్లు కాపుల్లో లేరా?” అని పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.

Also Read: గుంతకల్ టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. భారీ ర్యాలీతో నిరసన