నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏజెంట్‌గా పని చేస్తున్నారు

నిమ్మగడ్డ చంద్రబాబుకి ఏజెంట్‌గా పని చేస్తున్నారు

Updated On : January 29, 2021 / 4:02 PM IST

sajjala ramakrishna reddy on nimmgadda ramesh kumar: ఏపీలో పంచాయతీ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. రాజకీయాల్లో హీట్ పెంచాయి. ఏపీ ఎస్ఈసీ, ప్రభుత్వ పెద్దల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీలు, నేతలు, ప్రతినిధులు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై నిప్పులు చెరుగుతున్నారు. నిమ్మగడ్డ విమర్శలకు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.

తనతో పాటు పలువురు కీలక అధికారులపై వేటు వేయాలంటూ సిఫారసులు గుప్పిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డని చంద్రబాబు ఏజెంట్ గా అభివర్ణించారు. పంచాయతీ ఎన్నికలపై ముందే ఒక నిర్ణయానికి వచ్చినవాడిలా వ్యవహరిస్తూ, దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేస్తూ, కక్ష సాధింపు తరహాలో చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వారం రోజులుగా నిమ్మగడ్డ చేష్టలు అందుకు పరాకాష్ఠ అని సజ్జల అన్నారు.

నిమ్మగడ్డ భాష, సీనియర్ అధికారుల పట్ల దుందుడుకుగా, నియంతలా ప్రదర్శిస్తున్న పోకడలు పరిధిని మించిపోయాయని అన్నారు. బాధ్యతాయుతంగా ఎన్నికలు నిర్వహించడం ఆయనకు అప్పగించిన బాధ్యత అని, పరిధిలోకి లోబడి చర్యలు తీసుకోవాలని చెబుతున్న అధికారాలను మీరి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఈసీ అధికారాలు తనకు జన్మతః వచ్చిన హక్కుగా భావిస్తూ రాజులు, పాలెగాళ్ల తరహాలో అపరిమిత అధికారాలు చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆలోచనపరుడిలా వ్యవహరించాల్సిన స్థానంలో ఉన్న నిమ్మగడ్డ అందుకు భిన్నంగా ముందుకు పోతున్నారని సజ్జల అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో టీఎన్ శేషన్ మూసపద్ధతిలో ఉన్న విధానాలు తొలగించి నూతన విధానాలు ప్రవేశపెట్టినా, అది తన అధికారాలకు, పరిధిలోకి లోబడి తీసుకున్న నిర్ణయాలేనని సజ్జల ప్రస్తావించారు. నాడు శేషన్ విప్లవాత్మక సంస్కరణలతో రాజకీయనేతలు ఇబ్బంది పడినా, ఆయన తీసుకున్న నిర్ణయాలు పరిధికి లోబడినవి కావడంతో ఎవరూ అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ అందుకు పూర్తి విరుద్ధం అని అన్నారు.

గతంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేది కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించారని సజ్జల అన్నారు, నాటి ముఖ్యమంత్రి తన గదిలోకి వచ్చి ప్రశ్నించిన సమయంలోనూ విధి నిర్వహణకే కట్టుబడ్డారని గుర్తు చేశారు. వాస్తవానికి ద్వివేది నాడు చంద్రబాబుపై హత్యాయత్నం ఫిర్యాదు చేసే వీలున్నా, ఆయన వృత్తి ధర్మానికే కట్టుబడ్డారని కొనియాడారు. నిమ్మగడ్డ ఐఏఎస్ ఎలా అయ్యారో తెలియదని, అన్నిరోజుల పాటు సర్వీసులో ఎలా ఉన్నారో తెలియడం లేదని సజ్జల అన్నారు. తాను ఎస్ఈసీని విమర్శించడం లేదని, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను విమర్శిస్తున్నానని సజ్జల స్పష్టం చేశారు.

గతంలో ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన గోపాలకృష్ణ ద్వివేది కూడా ఎంతో సంయమనంతో వ్యవహరించారని, నాటి ముఖ్యమంత్రి తన గదిలోకి వచ్చి ప్రశ్నించిన సమయంలోనూ విధి నిర్వహణకే కట్టుబడ్డారని, వాస్తవానికి ద్వివేది నాడు చంద్రబాబుపై హత్యాయత్నం ఫిర్యాదు చేసే వీలున్నా, ఆయన వృత్తి ధర్మానికే కట్టుబడ్డారని కొనియాడారు. నిమ్మగడ్డ ఐఏఎస్ ఎలా అయ్యారో తెలియదని, అన్నిరోజుల పాటు సర్వీసులో ఎలా ఉన్నారో తెలియడంలేదని అన్నారు. తాను ఎస్ఈసీని విమర్శించడంలేదని, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను విమర్శిస్తున్నానని సజ్జల స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, తన పరిధిని దాటి అధికారులపై చర్యలకు ఆదేశాలు ఇస్తున్నారని సజ్జల మండిపడ్డారు. పార్టీ వేదికపై మాట్లాడకూడదనే అధికారం నిమ్మగడ్డకు లేదన్నారు. మేము నిమ్మగడ్డను తిట్టడం లేదన్న సజ్జల కేవలం ప్రశ్నిస్తున్నామని చెప్పారు. టీడీపీ మేనిఫెస్టో పై క్రిమినల్ చర్యలు కోరుతూ కోర్టుల్లో కేసు వేస్తామన్నారు.