సెలెక్ట్ కమిటీని అపాయింట్‌మెంట్ చేయలేరు – ధర్మాన

  • Published By: madhu ,Published On : January 27, 2020 / 07:56 AM IST
సెలెక్ట్ కమిటీని అపాయింట్‌మెంట్ చేయలేరు – ధర్మాన

Updated On : January 27, 2020 / 7:56 AM IST

రెండు బిల్లులపై నియమించబడిన సెలెక్ట్ కమిటీని స్పీకర్ అపాయింట్ మెంట్ చేయలేరని వైసీపీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. అపాయింట్ చేయకపోతే..కాలక్షేపం చేసినట్లు అవుతుందని తెలిపారు. మండలి రద్దు కాకపోతే ప్రమాదంలో పడే వారని స్పీకర్‌ను ఉద్దేశించి తెలిపారు. మండలి రద్దు వచ్చింది కనుక లక్కీగా బయటపడ్డారని, శాసనమండలిలో ఉన్న ఛైర్మన్ రూల్స్ వక్రీకరించి..తెలియక చేసుకున్నారని విమర్శించారు.

ఆయన స్పీకర్‌కు ప్రోసీజర్స్ పంపించలేదన్నారు. 2020, జనవరి 27వ తేదీ ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. శాసనమండలి రద్దుపై చర్చిస్తున్నారు. సీఎం జగన్ రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చర్చలో ధర్మాన పాల్గొన్నారు. శాసనమండలిని రద్దు చేయాల్సిందేనని, ఇలాగే సీఎం జగన్ ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించారు. 51 శాతం ప్రజలు తమకు తీర్పునిచ్చారని, ప్రజలతో తిరస్కరించబడిన టీడీపీ అభివృద్ధిని అడ్డుకొంటోందని విమర్శించారు.

బాబు నీచ రాజకీయాలకు ఇది నిదర్శనమన్నారు. సమావేశాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారని, బయట మాట్లాడే బదులు ఇక్కడకు వచ్చి అభిప్రాయాలు చెప్పవచ్చు కదా అని సూచించారు. అభివృద్ధి నిరోధక వ్యవస్థ అవసరమా అంటూ ప్రశ్నించారు. పెద్దల సభ తాత్కాలికమని అంబేద్కర్ ఆనాడే చెప్పారని సభలో గుర్తు చేశారు ధర్మాన. ఓడిపోయిన వారు..ఆ సభల్లో కూర్చొని అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటీ అంటూ సూటిగా ప్రశ్నించారు.

CRDA చట్టం 171 పేజీలున్న బిల్లుపై ఎన్ని రోజులు చర్చించారని, ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం పంపించిన బిల్లు 12 పేజీలు, 4 సెక్షన్లు ఉంటే..సెలెక్ట్ కమిటీకి పంపించారని విమర్శించారు. ఏది ఏమైనా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 

* పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల అభిప్రాయాలను జగన్ తెలుసుకున్నారని తెలిపారు. 
* 67 దేశాల్లో మాత్రమే ఎగువ దేశాలున్నాయి. 
* 101 దేశాల్లో పెద్దల సభలు లేవు. 
 

* బ్రిటీషర్ల ప్రోత్పాహంతోనే ఈ సభలు ఏర్పాటయ్యాయి. 
* పెద్దలకు గౌరవిస్తున్నామన్న పేరిట దేశానికి కన్నం పెట్టే పని చేశారు. 
* బ్రిటీష్ వాళ్ల వైఖరిని మహాత్మాగాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. 
* పునరావాస కేంద్రాలని ఆనాడే విమర్శలు వచ్చాయి. 

Read More : మండలి రద్దు చర్చ : బాబుకు ప్రజలు బుద్ధి చెబుతారు – ఆళ్ల కాళకృష్ణ శ్రీనివాస్