బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదు: విష్ణువర్ధన్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్యసాయి భక్తుల మనోభావాలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాయని తాను భావిస్తున్నానని..

బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదు: విష్ణువర్ధన్ రెడ్డి

S. Vishnuvardhan Reddy

హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలన్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను వక్రీకరించాల్సిన అవసరం లేదని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. హిందూపురం జిల్లా కేంద్రం కావాలని కొందరు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తానని బాలకృష్ణ చెప్పారని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్యసాయి భక్తుల మనోభావాలు అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాయని తాను భావిస్తున్నానని విష్ణువర్ధన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్య సాయి జిల్లా ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు.

పుట్టపర్తిలో శాశ్వత జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలో బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఇటీవల హిందూపురంలో బాలకృష్ణ అన్న క్యాంటీన్లను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ… జిల్లాకు సత్యసాయి పేరును అలానే ఉంచేయాలని అన్నారు. అయితే, హిందూపురాన్ని మాత్రం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని చంద్రబాబుకి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.

Also Read: అందుకే హైడ్రా పేరుతో నిర్మాణాలు కూల్చేస్తున్నారు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి