చంద్రబాబు నాయుడి ఢిల్లీ పర్యటనపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
మాట మీద నిలబడే సీఎం అవుతారా? లేక మోసగాడిగా ముద్ర వేసుకుంటారా? తేల్చుకోండి అని షర్మిల ట్వీట్ చేశారు.

YS Sharmila
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనం కానున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై టీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ పరిరక్షణపై చంద్రబాబు హామీని మరోసారి గుర్తు చేస్తున్నామని ఆమె చెప్పారు.
“ప్రతిపక్ష నేతగా 2021లో మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను మళ్లీ పంపుతున్నాం. ప్రైవేటీకరణ అడ్డుకుంటానని, ప్లాంట్ పూర్వ వైభవానికి కృషి చేస్తామని, అవసరమైతే రాజీనామాలు కూడా చేస్తామని, రాశారో లేదో చూసుకోండి. మాట మీద నిలబడే తత్వం మీదైతే, మీరిచ్చిన లేఖకు విలువుంటే, ఇచ్చిన హామీపై మోదీ, అమిత్ షాను నిలదీయండి.
ప్రైవేటీకరణ ఆపకపోతే మద్దతు ఉపసంహరణ అని డిమాండ్ పెట్టండి. ఆంధ్రుల హక్కు ముఖ్యమా? లేదా బీజేపీతో పొత్తు ముఖ్యమా? విశాఖ ఉక్కు ముఖ్యమా? లేదా ఎన్డీఏలో పదవులు ముఖ్యమా? మాట మీద నిలబడే సీఎం అవుతారా? లేక మోసగాడిగా ముద్ర వేసుకుంటారా? తేల్చుకోండి.
కార్మికులకు విజయదశమి కానుకగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను SAIL లో విలీనం చేస్తున్నట్లు, 14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తున్నట్లు, భూములు కోల్పోయిన 8 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు, 23 వేల ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా అమ్మేది లేనట్లు, అధికారిక ప్రకటన చేయించాలని, లేకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం” అని షర్మిల చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి పయనమవుతున్న@ncbn గారు… విశాఖ స్టీల్ పరిరక్షణపై మీరిచ్చిన హామీని మరోసారి గుర్తు చేస్తున్నాం. ప్రతిపక్ష నేతగా 2021 లో అనాడు మీరు సంతకం చేసి ఇచ్చిన లేఖను మళ్ళీ పంపుతున్నాం. ప్రైవేటీకరణ అడ్డుకుంటానని, ప్లాంట్ పూర్వ వైభవానికి కృషి… pic.twitter.com/6KwLsya7Yz
— YS Sharmila (@realyssharmila) October 6, 2024
బీచ్లో తొక్కిసలాట.. నలుగురి మృతి.. 230 మందికి గాయాలు