కుర్చీనే లేనప్పుడు ఎలా మడతపెడతారు.. లోకేశ్పై వైసీపీ నేతల సెటైర్లు
నీ కుర్చీని 2019లో మేం మడత బెడితే.. ఇప్పుడు నీ కుర్చీని మడత బెట్టుకుంటావని నువ్వే సంకేతాలు ఇచ్చావు.
YV Subba Reddy: 40 ఈయర్స్ ఇండస్ట్రీ టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా పోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. వచ్చే సాధారణ, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి రావొచ్చని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలతో శనివారం ఆయన సమావేశమయ్యారు. డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్లు మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడతేస్తారని ప్రశ్నించారు. తమకు షర్ట్స్ ఉన్నాయ్ కాబట్టి మడత వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. “విధ్వంసం” పుస్తకం రాసిన వాళ్లు, ఆవిష్కరించిన వాళ్లను చూస్తేనే దాని వెనుక విద్వేషం ఉందని అర్దం అవుతోందన్నారు.
లోకేశ్పై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు
లోకేశ్ నాలుక మడత తీస్తే కనీసం పదాలైన సరిగ్గా పలుకు తాడని మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. జగన్ దెబ్బకు లోకేశ్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయాయని ఎద్దేవా చేశారు. ”నీ కుర్చీని 2019లో మేం మడత బెడితే.. ఇప్పుడు నీ కుర్చీని మడత బెట్టుకుంటావని నువ్వే సంకేతాలు ఇచ్చావు. లోకేశ్ను మరోసారి మడత పెట్టేస్తాం. ఎర్రపుస్తకంతో పెద్ద పని, అవసరం వుండదు.. దానిని ఎక్కడ మడత పెట్టి పెట్టు కుంటావో నీ ఇష్టం. నువ్వు ఎంత సీరియస్ నేస్ క్రియేట్ చేసిన నీ కామెడీ ఫేస్ అందుకు సూట్ అవ్వద”ని గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
నిన్నవిజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేశ్ స్వయంగా కుర్చీ మడతపెట్టి చూపించిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల తర్వత జగన్ సీటు పోవడం ఖాయమని, తమ జోలికి వస్తే కుర్చీ మడతపెడతామని లోకేశ్ వ్యాఖ్యానించారు.
Also Read: పబ్లిక్ మీటింగ్లో కుర్చీ మడతపెట్టి చూపించిన నారా లోకేశ్.. ఎందుకో తెలుసా?