Today Horoscope: నేటి రాశి ఫలాలు.. శుక్రవారం వీరు ధనాన్ని పొదుపు చేస్తారు..!
ఈ రోజు (శుక్రవారం, అక్టోబర్ 18, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Astrology In Telugu
జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ కోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస బహుళ పాడ్యమి మ. 1:15 అశ్వని మ. 1:26
శుక్రవారము ద్వాదశ రాశుల ఫలితములు..
మేష రాశి: అనారోగ్యము నుంచి కోలుకోవడం, ధనాన్ని పొదుపు చేయడం, మీరు మీ పనులను పూర్తి చేయని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురిఅవుతారు. కుటుంబంలో సమస్యలు, సోమరితనం. అయిష్టమైన భోజనము, వ్యాపారాల్లో లాభములు, పనులలో ఆలస్యము, విద్యార్థులకు ప్రతికూల ఫలితములు. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
వృషభ రాశి: ప్రముఖలతో పరిచయములు, వ్యాపారములో లాభమలు, శ్రమను వృథా చేసుకోకూడదు. అవకాశాలు వినియోగించు కోవాలి, ధన ధాన్యలాభములు, కుటుంబంలో సంతోషము, విద్యార్థులకు అనుకూలము, ఉద్యోగ వ్యాపారములో అధిక ఆదాయం, విదేశీయానం, దూరపు ప్రయాణములు, దత్తాత్రేయ కవచ పారాయణము చేసిన ఉత్తమ ఫలితాలు వస్తాయి.
మిధున రాశి: మీరు ప్రేమించిన వారితో వివాదములు రాకుండా చూసుకోండి, అధిక లాభములు, ఏ రంగములో అయినా అభివృద్ధి, కుటుంబములో వారికి ఆరోగ్యము, ఆదరాభిమానములు పొందడం, విద్యావంతులు గౌరవ సన్మానములు పొందుతారు. వివాహ సంబంధమలు కుదురుతాయి. పిత్రార్జితము ద్వారా ధనము లభిస్తుంది. దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేసిన ఈ మంచి ఫలితములు కలుగుతాయి.
కర్కాటక రాశి: మనస్తాపం, ఉద్యోగ లాభం, పనులలో ఆలస్యం, నిధానంగా జరగడం, స్వజనులతో విరోధము, అకాల భోజనం, ఉద్యోగంలో అనుకూలత, ప్రయాణముల వలన లాభం, ప్రతిపనిలోని జయం, లాభములు, నూతనవస్త్రములు కొనుగోట. సుదర్శన మంత్రము చదివిన మంచి ఫలితాలు వస్తాయి
సింహ రాశి : అనవసర కార్యములకు ధనవ్యయం, అపకీర్తి, స్థానచలనము, శరీరంలో వాతము సోమరితనము, స్త్రీమూలకముగా తగవుల వలన మనఃశాంతి లోపించును. మనో వేదనల వలన పనిర్ణయమునకు త్వరం లేదు. వ్యాపారంలో నష్టము. శివ ఆరాధన చేసినచో అపాయములు తొలుగుతాయి.
కన్యా రాశి: ధనము కలసి రావడం, ప్రేమపెళ్లిళ్లు, ఇరుగు పొరుగు వారిలో అనుకూలత కలుగును, బంధువర్గంలో గౌరవము, ఆధిక్యతలు కలుగును. సంతోషముగా కాలము గడుపుతారు, విందు వినోదములు, శుభకార్యనిర్వాహణ. రాజ రాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయవలెను.
తులా రాశి: రోగభయము, ఉద్యోగంలో అనుకూలం, అకాల భోజనములు కలుగును, నమ్మినవారివలన మోసపోవడం, స్త్రీ మూలకంగా చికాకులు, వ్యాపారంలో ఇబ్బందులు, ప్రతి పనిలో విజయం, రహస్యములు దాచటం, ప్రమాణములలో ఆటంకములు. దేవి స్తోత్ర పారాయణం చేసినచో ఉత్తమైమన పలితములు కలుగుతాయి.
వృశ్చిక రాశి: బంధుమిత్రులతో విందులు, వినోదమలు, విలువైన వస్త్రములు కొనుగోలు చేయడం, ధనవృత్తి విషయంలో అభివృద్ధి కలగడం, ఆనందయగా కాలము గడుపుతారు, వ్యాపారంలో మంచి, భీమలు మానసిక వేదనలు, శ్రీ సుబ్రహ్మవేశ్వర స్వామి వారి ఆరాధనం వల్ల శుభం కలుగుతుంది.
ధనస్సు రాశి: ప్రయాణంలో ప్రయాసలు కలుగుట, వివాహాది శుభకార్యక్రమములకు ఆటంకములు కలుగును. పై అధికారులతో మాటలు పడవలసి వచ్చును. బంధు, పుత్ర, మిత్రులతో మాటామాట పట్టింపులు కలుగును. మనస్సు ఇబ్బందికరమైన సంఘటన కలుగును. దత్తకవచ పారాయం చేయవలెను శుభం జరుగును.
మకర రాశి: విందు వినోదములు, లాభాదాయకమైన ప్రయాణములు, సహాయ సహకారములు, వృత్తి, ఉద్యోగముల మందు ఉహించని లాభములు, ఇష్టులైన వారితో అనుభవజ్ఞులతో సలహా సంప్రదింపులు చేస్తారు. శివారాధన వలన మేలు జరుగుతుంది.
కుంభం: తలచిన ప్రతిపని కార్యముదాల్చును, గొప్పవ్యక్తులు, నూతన వ్యక్తులతో పరిచయములు కలుగును, ఫ్యాన్సీ, వెండి, బంగారు, నగలు, విలువైన దుస్తులు కొనుగోలు చేస్తారు, చేయువృత్తి, ఉద్యోగ వ్యాపారములలో అభివృద్ధి, రాణింపు ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మంచి జరుగుతుంది.
మీనం: స్థానచలనం, పేరు ప్రఖ్యాతలు కలగడం, అన్నింటా విజయము, వృత్తి, ఉద్యోగములలో అభివృద్ధి, రుణబాధలు తగ్గుతాయి, పిల్లల మాట, భార్య మాట వింటారు. మధుర భోజ్యములు చేస్తారు. ధనలాభం, గౌరవ సన్మానములు పొందుతారు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి జరుగుతుంది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956