Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ తులం గోల్డ్ రేటు ఎంతంటే..?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.

Gold Rate Today: బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. మళ్లీ తులం గోల్డ్ రేటు రూ.లక్షకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 3,360 డాలర్లు ఉండగా.. గురువారం నాటికి 13 డాలర్లు పెరిగి 3,373 డాలర్లకు చేరుకుంది.
భారతదేశంలో గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 24క్యారట్ల 10గ్రాముల బంగారంపై రూ. 430 పెరగ్గా.. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారంపై రూ. 400 పెరిగింది. గడిచిన నాలుగు రోజుల్లో 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ. 2,290 పెరిగింది. రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. గడిచిన నాలుగు రోజుల్లో కిలో వెండిపై రూ.3,100 పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.90,900 కాగా.. 24 క్యారట్ల ధర రూ.99,170కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.91,450 కాగా.. 24 క్యారట్ల ధర రూ.99,750కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 90,900 కాగా.. 24క్యారెట్ల ధర రూ.99,750కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,14,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,04,000 వద్ద కొనసాగుతుంది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,14,000 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.