Gold Price Today : బంగారం కొనేవారికి ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్ ధర ఎంతంటే?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Rate
Today Gold and Silver Rate: దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత రెండురోజుల క్రితం వరుసగా తగ్గిన బంగారం ధరలు రెండురోజులుగా వరుసగా పెరిగాయి. అయితే, పెరుగుదల స్వల్పంగా ఉండటం ఊరటకలిగించే అంశం. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 170 పెరిగింది. మరోవైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,700 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,950 కు చేరింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,850 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,100.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950కు చేరింది.
– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,350 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,660కు చేరింది.
స్థిరంగా వెండి ధర ..
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.77,200కు చేరింది. బెంగళూరులో కిలో వెండిపై రూ. 500 తగ్గింది. దీంతో అక్కడ కిలో వెండి రూ.76,000 వద్ద కొనసాగుతోంది.