UPI GST : UPI పేమెంట్స్ చేస్తే జీఎస్టీ కట్టాలా?.. వద్దా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..

UPI GST : రూ. 2వేల కన్నా ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.

UPI GST : UPI పేమెంట్స్ చేస్తే జీఎస్టీ కట్టాలా?.. వద్దా? కేంద్రం వన్ షాట్ ఆన్సర్..

GST on UPI Transactions

Updated On : April 19, 2025 / 10:41 AM IST

UPI GST : యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. రూ. 2వేల కన్నా ఎక్కువ UPI లావాదేవీలపై GST విధించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సోషల్ మీడియా సహా కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ వాదనలను తోసిపుచ్చింది. ఈ వార్తలు తప్పుదారి పట్టించేవి, నిరాధారమైనవి అని పేర్కొంది. ప్రస్తుతం కేంద్రం వద్ద ఇలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది.

యూపీఐ చెల్లింపులపై GST లేదు :
పేమెంట్ గేట్‌వే లేదా ఇతర మార్గాల ద్వారా విధించే సేవా రుసుము (మర్చంట్ డిస్కౌంట్ రేటు MDR వంటివి)కు సంబంధించిన ఛార్జీలపై మాత్రమే జీఎస్టీ విధిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే, జనవరి 2020 నుంచి CBDT P2M (వ్యక్తి నుంచి మర్చంట్) యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తొలగించింది. అంటే.. యూపీఐ చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీ విధించరు.

Read Also : OnePlus 13 Price Drop : వన్‌ప్లస్ క్రేజే వేరబ్బా.. ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 13 భారీగా తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు..!

డిజిటల్ పేమెంట్లను ముఖ్యంగా యూపీఐని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. UPI ప్రోత్సాహక పథకం 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తోంది. తక్కువ మొత్తంలో P2M లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,389 కోట్లు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,210 కోట్లు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,631 కోట్లుగా పేర్కొంది.

యూపీఐ లావాదేవీలు కూడా భారీగా పెరిగాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 21.3 లక్షల కోట్ల నుంచి మార్చి 2025 నాటికి రూ. 260.56 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో P2M లావాదేవీలు రూ. 59.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి.

ACI వరల్డ్‌వైడ్ రిపోర్ట్ 2024 ప్రకారం.. 2023లో ప్రపంచంలోని మొత్తం రియల్-టైమ్ లావాదేవీలలో భారత్ 49శాతం వాటాను కలిగి ఉంది. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారత్ ప్రపంచ అగ్రగామిగా మారింది.