Union Budget 2026 : టైమ్ మార్చిన ట్రెడిషన్.. సాయంత్రం 5 కాదు… ఉదయం 11కే బడ్జెట్ ఎందుకు? బడ్జెట్ టైమింగ్ వెనుక బ్రిటిష్ స్టోరీ..
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026కు సమయం ఆసన్నమవుతోంది. ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతంలో బడ్జెట్ టైమింగ్ ఎప్పుడు ఉండేదో మీకు తెలుసా?
Union Budget 2026 (Photo Credit : AI )
- బ్రిటిష్ వారసత్వానికి వీడ్కోలు.. ఉదయం 11 గంటలకే బడ్జెట్
- సాయంత్రం 5కి బడ్జెట్ పెట్టే సంప్రదాయం ఎలా వచ్చింది?
- బడ్జెట్ టైమింగ్ మార్పుతో బ్రిటిష్ వారసత్వానికి గుడ్బై
- బడ్జెట్ టైమింగ్ వెనుక బ్రిటిష్ రహస్యం ఏంటి?
- 53 ఏళ్ల పాటు కేంద్ర బడ్జెట్ సాయంత్రం 5 గంటలకే
Union Budget 2026 : అందరి చూపు బడ్జెట్ వైపే.. కేంద్ర వార్షిక బడ్జెట్ 2026కు మరికొద్ది రోజులే సమయం మిగిలి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026న పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెడతారు. అయితే, ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడతారు.
ఈసారి బడ్జెట్ మొదటి రోజున అంతా సాధారణంగానే ఉంటుంది. కానీ, ఎప్పుడూ ఇలా ఉండేది కాదు. గతంలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టేవారు. ఆ తర్వాత ఈ సంప్రదాయం అకస్మాత్తుగా మారిపోయింది. బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని ఎందుకు మార్చారు? అసలు ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అప్పట్లో బ్రిటిష్ టైమ్ ప్రకారమే బడ్జెట్ :
వాస్తవానికి, స్వాతంత్ర్యం వచ్చిన దాదాపు 53 ఏళ్ల పాటు కేంద్ర బడ్జెట్ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఈ సంప్రదాయం బ్రిటిష్ కాలం నాటిది. ఆ సమయంలో, భారత్లో సాయంత్రం 5 గంటలుగా ఉంటే.. బ్రిటన్లో ఉదయం 11 గంటలుగా ఉండేది. ప్రభుత్వం, అధికారులు బడ్జెట్ సంబంధిత సమాచారాన్ని సులభంగా పొందగలిగేలా లండన్ లొకేషన్ బట్టి బడ్జెట్ సమయాన్ని నిర్ణయించారు.
1999లో బ్రిటిష్ సంప్రదాయం రద్దు :
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ చాలా కాలం కొనసాగింది. కాలక్రమేణా దీని అవసరం తగ్గుతూ వచ్చింది. కానీ, ఆ సంప్రదాయం మాత్రం మారలేదు. చివరికి, 1999లో ఈ సంప్రదాయానికి వీడ్కోలు పలికింది. ఆ సమయంలో, అటల్ బిహారీ వాజ్పేయి కేంద్ర ప్రభుత్వంలో, యశ్వంత్ సిన్హా ఆర్థిక మంత్రిగా ఉన్నారు. దశాబ్దాల నాటి సంప్రదాయానికి ముగింపు పలికి ఆయన మొదటిసారి ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
భారత సమయానికి అనుగుణంగా మార్పు :
ఆ తరువాత, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయాన్ని శాశ్వతంగా ఉదయం పూటగా నిర్ణయించారు. ఈ మార్పు అనేది ఏ విదేశీ వ్యవస్థకు అనుగుణంగా కాకుండా భారతీయ అవసరాలు, సమయాల ప్రకారం మాత్రమే జరిగింది.
బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ మార్పు ఎందుకంటే? :
బడ్జెట్ సమయం మాత్రమే కాదు.. తేదీ కూడా మారింది. 2017 వరకు, కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశపెట్టేవారు. ఈ సంప్రదాయం బ్రిటిష్ కాలం నాటిది. అయితే, బడ్జెట్లో ప్రకటించిన పథకాలు, పన్ను మార్పుల అమలు ఆలస్యం అవుతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది.
అందుకే 2017లో బడ్జెట్ తేదీని మార్చారు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇకపై ప్రతి ఏడాదిలో ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్లో ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ నిర్ణయాలను సకాలంలో అమలు చేయడమే దీని ఉద్దేశ్యం. ప్రస్తుత బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
