వరంగల్ లో యువకుడు దారుణ హత్య

  • Published By: murthy ,Published On : November 23, 2020 / 01:35 PM IST
వరంగల్ లో యువకుడు దారుణ హత్య

Updated On : November 23, 2020 / 2:17 PM IST

young man murder at warangal : వరంగల్, మండి బజార్ లో ఓయువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్ పై వచ్చిన దుండగుల్లోని ఒకరు యువకుడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయటంతో తీవ్రగాయాల పాలైన యువకుడు అక్కడి కక్కడే మరణించాడు. సీఐ వెంకటేశ్వర్లు చెప్పిన వివరాల ప్రకారం…. కాశిబుగ్గ సాయిగణేష్‌ కాలనీకి చెందిన దేశమల్ల రాజ్‌కుమార్‌ (28) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈనెల 21న కాశిబుగ్గలో జరిగిన ఓ వివాహ వేడుకలో… గిమ్మాజిపేట బొడ్రాయి ప్రాంతానికి చెందిన యాట ప్రవీణ్‌ అలియాస్‌ డీజే లడ్డూకు, రాజ్‌కుమార్‌కు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించి నవంబర్ 22,ఆదివారం ఉదయం పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి సర్దుబాటు చేశారు. అయినా లడ్డూ రాజ్ కుమార్ మీద కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజ్‌కుమార్‌ ఆదివారం రాత్రి ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ పాన్‌ షాపు వద్ద ఉండగా లడ్డూ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై వచ్చి మాట్లాడాలని రాజ్‌కుమార్‌ను పక్కకు తీసుకెళ్లాడు.



https://10tv.in/lodge-manager-murdered-in-dharmavaram/
రాజ్ కుమార్ ను పక్కకు తీసుకెళ్లిన లడ్డూ తన వెంట తీసుకొచ్చిన కత్తితో, అతడిపై విచక్షణారహితంగా పొడిచి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలి పడిపోయిన రాజ్‌కుమార్‌ను అతని స్నేహితులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రాజ్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు లడ్డూ, అతని స్నేహితులు పరారీలో ఉన్నారు.