క్షమాభిక్షకు ఇంక వారమే గడువు… నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష
నిర్భయ దోషుల దొంగాటకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టింది. దోషులకు వారం రోజులే గడువు ఇచ్చింది. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తెలిపింది.

నిర్భయ దోషుల దొంగాటకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టింది. దోషులకు వారం రోజులే గడువు ఇచ్చింది. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తెలిపింది.
నిర్భయ దోషుల దొంగాటకు ఢిల్లీ హైకోర్టు చెక్ పెట్టింది. దోషులకు వారం రోజులే గడువు ఇచ్చింది. క్షమాభిక్ష అన్ని అవకాశాలను ఉపయోగించుకోవడానికి వారం రోజులే గడువు ఇచ్చింది. నలుగురు దోషులనూ ఒకేసారి ఉరి తీయాలని కోర్టు తెలిపింది. వేర్వేరుగా ఉరితీయాలన్న కేంద్రం వినతిని కోర్టు తోసిపుచ్చింది. నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలును వెంటనే జరపాలని కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. నలుగురు దోషులకు ఉరిశిక్ష ఒకేసారి అమలు కావాల్సివుంటుంది. దీనికి సంబంధించిన జైలు నిబంధనలు 834, 836 అంశాలను కోడ్ చేస్తూ ఆర్టికల్ 21ను ఉపయోగించి వీరు ఉరిశిక్ష అమలును జాప్యం చేస్తున్నారన్న విషయాన్ని కూడా హైకోర్టు వ్యక్త పరిచింది.
అయితే న్యాయపరంగా వీరికి ఉన్న అవకాశాలను వారం రోజుల్లోగా వినియోగించుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈరోజు నుంచి వారం రోజుల్లోపు దోషులకు ఉన్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాల్సివుంటుంది. ఇప్పటికే వినయ్, ముఖేష్ కు సంబంధించి న్యాయపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి. అక్షయ్ కు సంబంధించి క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. పవన్ కు సంబంధించి క్యురేటివ్ పిటిషన్, మెర్సీ పిటిషన్ ఫైల్ చేయాల్సివుంది. ఈ ఇద్దరు కూడా వారం రోజుల్లోగా వారికున్న న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించడంతో వీరు వారం రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాల్సివుంటుంది.
తదుపరి వీరు వినియోగించుకున్న న్యాయమైన అవకాశాల ఆధారంగానే చట్టపరంగా వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు చెక్ పాయింట్ పెట్టిందని చెప్పవచ్చు. వీరికి వారం రోజుల సమయం విధించడంతో ఒకరి తర్వాత ఒకరు కాకుండా నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలన్న నిబంధనకు లోబడే ముఖ్యంగా వీరికున్న అవకాశాలను వినియోగించుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆఖరి అవకాశం ఇచ్చింది. జైలు నిబంధనల్లో ఉన్న లొసుగులకు సంబంధించి సొలిసిటర్ జనరల్ వాదనలను పరిగణనలోకి తీసుకొని, ముఖ్యంగా వేర్వేరుగా వీరికి ఉరిశిక్ష విధించలేమని, అందుకు నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని, తీహార్ జైలు నిబంధనలను కోడ్ చేస్తూ ఆ విధంగా ఉరితీయలేమన్న అంశాలను హైకోర్టు స్పష్టం చేసింది.
వారం రోజుల్లో అక్షయ్, పవన్ కు ఉన్న అవకాశాలను వినియోగించుకున్న తర్వాత తదుపరి విచారణ జరుగబోతుంది. ఈ వ్యవహారం మళ్లీ కోర్టులోకి వస్తుంది. ప్రస్తుతం అక్షయ్ మెర్సీ పిటిషన్ రాష్ట్రపతి వద్ద ఉంది..అది రిజక్ట్ అయితే కనుక కచ్చితంగా కోర్టులో ఇంటిమేషన్ చేస్తారు. మళ్లీ కోర్టు నుంచి..వారం రోజుల్లో వీరికి ఉన్న అవకాశాలను వినియోగించుకున్న తర్వాత అక్షయ్ కు సంబంధించిన మెర్సీ పిటిషన్ కనుక రిజక్ట్ అయితే 14 రోజులు సమయం ఉంటుంది. అలాగే పవన్ క్యూరేటివ్ పిటిషన్, మెర్సీ పిటిషన్ రిజక్ట్ అయితే మళ్లీ 14 రోజుల సమయం ఉంటుంది.
అయితే ఈ జాప్యానికి సంబంధించి ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఇందుకు నిబంధనలు ఉన్నాయి.. నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాల్సివుంటుంది. పూర్తిగా చట్టంలో మార్పు తెస్తేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు నలుగురు దోషుల్లో ఎవరైతే అవకాశాలు పూర్తి అయినా వారిని వేరుగా ఉరితీయాలని కోరారో దానికి మాత్రం నిరాకరించింది. ఒకే కేసులో ఈ నలుగురు నిందితులుగా ఉన్నారు కాబట్టి, నలుగురికీ ఒకేసారి ఉరిశిక్ష అమలు కావాల్సివుంది. వీరు అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న తర్వాతే దోషులకు ఉరిశిక్ష అనేది అమలు కాబోతోంది. దానికి వారం రోజుల సమయాన్ని ఢిల్లీ హైకోర్టు ఈరోజు కేటాయించింది.
జనవరి 31వ తేదీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆదివారం (ఫిబ్రవరి 2, 2020) న సెలవు దినం అయినా సుమారు మూడున్నర గంటలపాటు విచారణ జరిపి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. బుధవారం (ఫిబ్రవరి 5, 2020) కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. వారం రోజుల్లో అయినా వీరికున్న అవకాశాలను వినియోగించుకుంటారా? ఇంకా ప్రొలాంగ్ కు తీసుకెళ్తారా అనేది చూడాలి మరి.