Love Marriage: కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంట…మూడు రోజుల తర్వాత ఏమైందంటే…

తమ కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడులో తమ కుటుంబాలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లయిన మూడు రోజులకే హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు....

Love Marriage: కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంట…మూడు రోజుల తర్వాత ఏమైందంటే…

Love Marriage

Wedding : తమ కుటుంబసభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడులో తమ కుటుంబాలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న ఓ జంట పెళ్లయిన మూడు రోజులకే హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. తూత్తుకుడికి చెందిన సెల్వం (24), కార్తీక (20) గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అక్టోబరు 31న కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పారిపోయి పెళ్లి చేసుకున్నారు.

Also Read : Cobra : సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్…ఎందుకంటే బుసలుకొట్టే నాగుపాము చూసి…

పెళ్లయినప్పటి నుంచి వీరు మురుగేషన్ నగర్‌లో సహజీవనం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఐదుగురు వ్యక్తుల ముఠా దంపతుల ఇంట్లోకి ప్రవేశించి వారిని నరికి చంపి పరారైంది. జంట హత్యల గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తూత్తుకుడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read : Trinamool MP Mahua Moitra : లోక్‌సభ స్పీకరుకు ఎంపీ మహువా మొయిత్రా సంచలన లేఖ

రెండు మోటర్‌బైక్‌లపై దంపతుల ఇంటికి వచ్చిన ఆరుగురు వ్యక్తులు హత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ బాలాజీ, రూరల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ సురేశ్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.