Trinamool MP Mahua Moitra : లోక్‌సభ స్పీకరుకు ఎంపీ మహువా మొయిత్రా సంచలన లేఖ

ఎథిక్స్ కమిటీ విచారణ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సంచలన లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనను విచారణ పేరుతో వస్త్రాపహరణం చేశారని, అనైతికంగా, పక్షపాతంతో ప్రవర్తించారని మహువా ఆరోపించారు....

Trinamool MP Mahua Moitra : లోక్‌సభ స్పీకరుకు ఎంపీ మహువా మొయిత్రా సంచలన లేఖ

Trinamool MP Mahua Moitra

Updated On : November 3, 2023 / 5:32 AM IST

Trinamool MP Mahua Moitra : ఎథిక్స్ కమిటీ విచారణ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సంచలన లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనను విచారణ పేరుతో వస్త్రాపహరణం చేశారని, అనైతికంగా, పక్షపాతంతో ప్రవర్తించారని మహువా ఆరోపించారు. లోక్‌సభలో 78 మంది మహిళా సభ్యులలో ఒకరిగా ఉన్న తాను ఎథిక్స్ కమిటీ ఛైర్‌పర్సన్ చేత విచారణ పేరుతో వస్త్రాపహరణకు గురిచేయడం ఎంత అవమానకరమని ఎంపీ పేర్కొన్నారు.

Also Read : Cobra : సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్…ఎందుకంటే బుసలుకొట్టే నాగుపాము చూసి…

పార్ల‌మెంట్‌లో ప్ర‌శ్న‌లు వేయ‌డానికి మ‌హువా మొయిత్రా రూ.2 కోట్ల లంచం తీసుకున్నారా అనే అంశంపై విచార‌ణ జ‌రిగిన స‌మ‌యంలో పార్ల‌మెంట‌రీ ప్యానెల్ స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆమె వాకౌట్ సమయంలో ఆమె ప్యానెల్ క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆమె స్టాండ్‌ను బలపరిచిన బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ కూడా చేరారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ కే నైతికత లేదని, తన పరువుకు నష్టం కలిగించేలా ప్రశ్నించారని ఆమె ఆరోపించారు.

Also Read : Kasani Gnaneshwar : బీఆర్ఎస్ లో చేరనున్న కాసాని.. గోశామహల్ నుంచి పోటీ?

ఎథిక్స్ కమిటీ 11 మంది సభ్యుల్లో అయిదుగురు బయటకు వచ్చి కమిటీ విచారణను బహిష్కరించారని మొయిత్రా లేఖలో పేర్కొన్నారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ వినోద్ సోంకర్ తన వ్యక్తిగత జీవితం గురించి అసహ్యకరంగా ప్రశ్నించారని ఎంపీ ఆరోపించారు. అసభ్యకరమైన ప్రశ్నలు అడగవద్దని కమిటీలోని ఇతర సభ్యులు హెచ్చరించినా ఛైర్మన్ అలానే ప్రశ్నించారని మహువా చెప్పారు. తాను రాత్రిపూట ఎవరితో మాట్లాడతారని, ఎన్నిసార్లు మాట్లాడుతారని ఆ కాల్స్ వివరాలు అడిగారని ఎంపీ మొయిత్రా స్పీకరుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Also Read : Another Case On Chandrababu : చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన సీఐడీ

మహువా మొయిత్రా తన లేఖలో హీరానందనీ నగదు ఆధారాలు ఏదీ అందించలేదని పేర్కొన్నారు. మహువా మోయిత్రా పార్లమెంటు ఎథిక్స్ కమిటీ ముందు సమర్పించిన దర్శన్ హీరానందానీ యొక్క అఫిడవిట్ యొక్క విశ్వసనీయతను ప్రశ్నించారు. మొయిత్రా పార్లమెంటు ప్రోటోకాల్‌లను ఉల్లంఘించారని నిర్ధారించడానికి తన వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చెప్పారు.