జూబ్లీహిల్స్లో ఫెరారీ కారు బీభత్సం

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఫెరారీ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో దూసుకెళ్తూ అదుపు తప్పిన ఫెరారీ కారు పాదాచారులను ఢీకొట్టింది. కారు ఢీకొని ఏసుబాబు అనే వ్యక్తి మృతిచెందాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరొకరిని ఆస్పత్రికి తరలించారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.