ప్రమాదం ఎలా జరిగింది…ప్రత్యక్ష సాక్షి కథనం
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగరబత్తీల స్టాల్లో మొదలైన మంటలు.. పక్కనే ఉన్న స్టాల్స్కు అంటుకున్నాయి. మరోవైపు చాట్ బండ్ వద్ద గ్యాస్ సిలిండర్ పేలడమే ప్రమాదానికి కారణమని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో.. నుమాయిష్కు భారీగా తరలివచ్చిన సందర్శకులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20కిపైగా ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు సంఘటనా స్థలంలో సహాకయ చర్యలు చేపట్టాయి. విద్యుత్ సరఫరాను నిలిపివేసి సందర్శకులను బయటకు పంపారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా అసెంబ్లీ నుంచి నాంపల్లి వెళ్లే రహదారిని తాత్కాలికంగా మూసివేశారు.
నుమాయిష్ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. 2019, జనవరి 30వ తేదీ రాత్రి 8.30గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆంధ్రాబ్యాంకు స్టాల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అధికారులు గుర్తించారు. మంటలు వేగంగా వ్యాపించడంతో 400 స్టాల్స్ కాలి బూడదయ్యాయి. దట్టమైన పొగలతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పక్క స్టాల్స్కు మంటలు వేగంగా విస్తరించాయి. అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్ల సాయంతో మూడు గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నుమాయిష్ చరిత్రలోనే ఇది అతిపెద్ద అగ్నిప్రమాదం. ప్రమాదం జరిగిన వెంటనే.. సందర్శకులు పరుగులు తీయడంతో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ముగ్గురు మహిళలకు తీవ్రగాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పొగ కారణంగా ఊపిరాడక 10మందికి అస్వస్థతకు గురయ్యారు. వారిని నిమ్స్తో పాటు నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నుమాయిష్లో అగ్నిప్రమాద ఘటనతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నుమాయిష్కు దాదాపు 30వేల మంది సందర్శకులు వచ్చినట్టు అధికారులు భావిస్తున్నారు. వీరంతా ఒక్కసారిగా ఎగ్జిబిషన్ మైదానం నుంచి బయటకు రావడంతో నాంపల్లి గాంధీభవన్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. టిక్కెట్టు లేకపోయినా సందర్శకులకు మెట్రోలో ప్రయాణించేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.
మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అగ్నిప్రమాదంపై ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ నుమాయిష్లో జరిగిన అగ్నిప్రమాదంపై ఆరా తీశారు. ఆస్తి నష్టం వివరాలను అంచనా వేసి నివేదిక ఇవ్వాలని ఎగ్జిబిషన్ కార్యదర్శిని ఆదేశించారు.
స్టాళ్లలోని వస్తువులు అగ్నికి ఆహుతి కావడంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్నప్పటికీ సిబ్బంది సకాలంలో ప్రమాద స్థలికి రాకపోవడంతో మంటలు చుట్టు పక్కల వ్యాపించాయని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఎగ్జిబిషన్లోని స్టాళ్లలో ఎక్కువగా ప్లాస్టిక్ వస్తువులు విక్రయించే దుకాణాలు ఉండటంతో క్షణాల్లో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకునే లోపే దుకాణాలు కాలి బూడిదయ్యాయి. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనావేస్తున్నారు.
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన అగ్నిప్రమాదంలో 250 స్టాల్స్ వరకు దగ్ధమయ్యాయని జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. 19 ఫైర్ ఇంజిన్లు వెంటనే వచ్చి మంటలు అదుపు చేశాయని, జలమండలి వాటర్ ట్యాంక్స్ వినియోగించామని ఎలాంటి ప్రాణ నష్టం తీసుకున్నారు.
ఎక్కడైనా ఎగ్జిబిషన్ ఊరికి దూరంగా ఉంటుంది..కానీ హైదరాబాద్లోనే నగరం మధ్యలో ఎగ్జిబిషన్ ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరటనిస్తోందని, ఇప్పటికైనా నగరం నుంచి ఎగ్జిబిషన్ను వేరే ప్రాంతానికి తరలించాలన్నారు.