ఏపీ టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా కేసు

అసైన్డ్‌ ల్యాండ్‌ను తన పేరు మీద రాయించుకొని విల్లాలను కట్టారు. గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి పలు ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

ఏపీ టీడీపీ నేత ఇంటికి తెలంగాణ పోలీసులు.. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా కేసు

AP Tdp Leader In Land Grabbing Case

Land Grabbing :  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో హైడ్రామా సాగింది. టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి శివానంద రెడ్డి ఇంటికి తెలంగాణ పోలీసులు వెళ్లడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఓ భూ వివాదం కేసులో శివానంద రెడ్డిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శివానంద రెడ్డి ఇంటికి వెళ్లారు. నేరుగా శివానందరెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో మొదట నోటీసులు ఇవ్వాలని పోలీసులను కోరారు శివానంద రెడ్డి. ఆ తర్వాత అరెస్ట్ వారెంట్ చూపాలంటూ కోరారు.

ఈ మేరకు పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు రెడీ చేస్తుండగా.. అక్కడి నుంచి శివానంద రెడ్డి వెళ్లిపోయారు. శివానందరెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే, తాను ఎక్కడికీ పారిపోలేదని.. నోటీసులు ఉంటే విచారణకు సహకరిస్తానన్నారు శివానంద రెడ్డి.

మాజీ పోలీస్ అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య, కుమారుడు అరెస్ట్ అయ్యారు. శివానంద రెడ్డి కోసం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి క్షణాల్లో శివానందరెడ్డి పరారయ్యారు. హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు శివానందరెడ్డి. లాండ్ గ్రాబింగ్ కేసులో సీసీఎస్ పోలీసులు నంద్యాల వెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా భూమి రెగ్యులరైజేషన్ చేయించుకున్నారు.

రాజేంద్రనగర్ శివారులో వేల కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఔట్ వేశారు. ప్రభుత్వ స్థలంలో విజల్లా ఇన్ ఫ్రా పేరుతో విల్లాల అమ్మకాలు చేశారు. హైదరాబాద్ నార్సింగిలో గతంలో విలువైన పోలీస్ ల్యాండ్ సైతం కాజేశారు శివానందరెడ్డి. గ్యాంగ్ స్టర్ నయీంతో కలిసి పలు ల్యాండ్ సెటిల్ మెంట్లు చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

సీసీఎస్‌లో మాజీ ఐపీఎస్ శివానందరెడ్డికి సంబంధించిన గ్రూప్ పై కేసు నమోదైంది. విజల్లా గ్రూప్ ద్వారా బుద్వేల్ లో 29 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు గుర్తించారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టారు విజల్లా గ్రూప్ శివానందరెడ్డి. 2వేల 500 కోట్ల రూపాయల భూమి కబ్జా చేశారు శివానంద రెడ్డి. అసైన్డ్‌ ల్యాండ్‌ను తన పేరు మీద రాయించుకొని విల్లాలను కట్టారు. శివానందరెడ్డితో పాటు భార్య, కుమారుడిపై కేసు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. శివానందరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీపై నాలుగు కేసులు నమోదు చేశారు. నాలుగు కంపెనీల ద్వారా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారనే ఆరోపణలపై కేసులు పెట్టారు.

బుద్వేల్‌లో 29 ఎకరాల ల్యాండ్‌ వ్యవహారంలో శివానందరెడ్డిపై కేసు బుక్ అయ్యింది. అసైన్డ్‌ ల్యాండ్‌ను కొనుగోలు చేసి విల్లాలు చేసి విక్రయించారు శివానంద రెడ్డి. శివానందరెడ్డితో పాటు పలువురు వ్యాపారవేత్తలపై కేసులు పెట్టారు పోలీసులు. శివానందరెడ్డిని అరెస్ట్‌ చేసేందుకు సీసీఎస్‌ పోలీసులు కర్నూలు వెళ్లగా.. సీసీఎస్‌ పోలీసుల కళ్లుగప్పి శివానందరెడ్డి పారిపోయారు. శివానందరెడ్డి కోసం పోలీసులు కర్నాటక, ఏపీలో తీవ్రంగా గాలిస్తున్నారు.

Also Read : కోమటిరెడ్డివి రూ.3.50కోట్లు, రఘునందన్‌వి రూ.కోటి.. మాజీ డీసీపీ రాధా కిషన్‌ రిమాండ్‌ రిపోర్టులో సంచలన విషయాలు