Mali Bus Accident : మాలిలో వంతెన పైనుంచి పడిపోయిన బస్సు.. 31మంది మృతి

ఆఫ్రికా దేశం మాలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. నది వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ..

Mali Bus Accident : మాలిలో వంతెన పైనుంచి పడిపోయిన బస్సు.. 31మంది మృతి

Mali bus accident

Mali : ఆఫ్రికా దేశం మాలిలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నది వంతెనపై నుంచి వెళ్తున్న బస్సు పడిపోయింది. ఈ ఘటన కెవిబాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 31 మంది మరణించారు. మరో పది మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని చికిత్సనిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.

Also Read : Road Accident : ఎల్బీన‌గ‌ర్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ మృతి, ఎస్ఐకు తీవ్ర గాయాలు

మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బుర్కినా ఫాసో వెళ్తోంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గత రెండు నెలల క్రితంకూడా మాలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 15మంది మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.