ఆ వీడియోలు ఆడవాళ్లు కూడా చూస్తున్నారు

  • Published By: chvmurthy ,Published On : December 20, 2019 / 09:22 AM IST
ఆ వీడియోలు ఆడవాళ్లు కూడా చూస్తున్నారు

Updated On : December 20, 2019 / 9:22 AM IST

తమిళనాడు రాష్ట్రంలో అశ్లీల వీడియోలను అదే పనిగా చూసే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3వేల మంది ఎక్కువ సమయం అశ్లీల వీడియోలు చూస్తూ టైమ్ పాస్  చేస్తున్నారు. వారిలో మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అడిషనల్ డీజీపీ రవి చెప్పటం విస్మయానికి గురిచేస్తోంది. వీరిలో చెన్నైకి చెందిన 30 మంది మహిళలను గుర్తించామని వారు ఇక నుంచి అశ్లీల వీడియోలు చూడవద్దు అని పిలుపునిచ్చారు. అశ్లీల వీడియోలను వీక్షించ వద్దు అని యువతులు, మహిళలకు  ఆయన పిలుపు నిచ్చారు.   

చెన్నై కోడంబాక్కంలోని ఓ మహిళా కళాశాలలో గురువారం పోలీస్‌ యాప్‌ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో ఏడీజీపీ రవి మాట్లాడుతూ, మహిళలు, పిల్లల మీద దాడుల్ని అరి కట్టడం లక్ష్యంగా పోలీసు యంత్రాంగం చర్యల్ని వేగవంతం చేసిందన్నారు. 7.30 కోట్ల మంది జనాభా కల్గిన ఈ తమిళనాడులో ఇప్పటి వరకు పోలీసు యాప్‌ను పది లక్షల మంది మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకున్నారని, వీరిలోనూ కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టు  వివరించారు.  మిగిలిన వారు ఎందుకు ఈ యాప్‌ మీద దృష్టి పెట్టడం లేదోతెలియటం లేదని విచారం వ్యక్తం చేశారు.

మహిళలు, పిల్లలకు భద్రత కల్పించే విధంగా పోలీసు శాఖ  రూపకల్పన చేసిన ఈ యాప్‌లో స్వల్ప మార్పులు చేయనున్నట్టు  తెలిపారు. ఇటీవల కాలంగా అశ్లీల చిత్రాల్ని వీక్షించే వారి సంఖ్య పెరిగి ఉండడం విచారకరంగా పేర్కొన్నారు.  పిల్లలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ వ్యవహారాల్ని అడ్డుకుందామని విద్యార్థినులకు ఆయన పిలుపు నిచ్చారు. పోర్న్‌ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు  ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలపై లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు పెరిగి పోతున్నాయి.

దీంతో మహిళలకు, పిల్లలకు భద్రతకల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో చర్యలు చేపట్టారు. చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్‌ల్లో గంటల కొద్ది గడిపే వారిని గుర్తించి
వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.