సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పిస్తా : తలసాని 

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాద ఘటనపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 10:53 PM IST
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పిస్తా : తలసాని 

Updated On : January 30, 2019 / 10:53 PM IST

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన ప్రమాద ఘటనపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిడ్డాయి. స్టాల్స్‌కు మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందర్శకులు భయంతో పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట జరిగింది. 10 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు కేర్, నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఈ ప్రమాద ఘటనపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పారు. 

నుమాయిష్‌ జరుగుతుండటంతో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సందర్శకులతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. 2019, జనవరి 30వ తేదీ బుధవారం రాత్రి అనూహ్య రీతిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తొక్కిసలాటలో చాలామందికి గాయాలయ్యాయి. ఇంకా అనేకమంది స్టాల్స్‌లో చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు ఏర్పాటు చేసిన స్టాల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం.