వీసా ఫ్రాడ్ కేసులో ముగ్గురు భారతీయులు అరెస్ట్

వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు క‌న్స‌ల్టెంట్ల‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Published By: venkaiahnaidu ,Published On : April 2, 2019 / 01:00 PM IST
వీసా ఫ్రాడ్ కేసులో ముగ్గురు భారతీయులు అరెస్ట్

Updated On : April 2, 2019 / 1:00 PM IST

వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు క‌న్స‌ల్టెంట్ల‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.

వీసా ఫ్రాడ్ కేసులో భారత సంతతికి చెందిన ముగ్గురు క‌న్స‌ల్టెంట్ల‌ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. శాంతా క్లారాలో నివిసించే కిషోర్ ద‌త్త‌పురం, టెక్సాస్ లో నివసించే కుమార్ అశ్వ‌ప‌తి,శాన్ జోస్ లో నివసించే సంతోష్ గిరిలు ఇతర కంపెనీలతో పోటీ పడే క్రమంలో ప్రయోజనం పొందడం కోసం హెచ్‌1-బీ వీసాల దరఖాస్తులో అక్రమాలకు పాల్పడారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపర్చారు.
Read Also : పౌరుషం అంటే ప్యాకేజీకి అమ్ముడుపోవడమా : పవన్‌కు ప్రశ్న ​​​​​​​

నానోసిమాంటిక్స్ కంపెనీ పేరుతో ఈ ముగ్గురూ ఓ క‌న్స‌ల్టెన్సీ నడిపిస్తున్నారు.వ‌ర్క‌ర్ల కోసం నకిలీ హెచ్‌-1బీ వీసాల‌ను వీళ్లు జారీ చేశారు. ఉద్యోగాలు లేని వాళ్లకు కూడా వీళ్లు వీసాల‌ను ఇచ్చారు.అయితే వీసా దరఖాస్తులో భాగంగా ఐ-129 అనే పిటిషన్‌ ను అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ విభాగానికి సమర్పించాల్సి ఉంటుంది. అందులో అభ్యర్థి చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలి.

అయితే ఈ ముగ్గురు భారతీయులు లేని ఉద్యోగాల్ని ఉన్నట్లుగా చూపించి లాభం పొందాలని చూశారని అక్కడి పోలీసులు కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో తెలిపారు.చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి థర్డ్‌ పార్టీలను కూడా వాళ్లు ఆశ్రయించినట్లు పోలీసులు కోర్టుకి తెలియజేశారు.ప్రస్తుతం ఈ ముగ్గురు బెయిల్ పై బయటకు వచ్చారు. తదుపరి విచారణ నిమిత్తం మే-13న కోర్టులో హాజరుకానున్నారు. ఈ కేసులో దోషులుగా తేలితే పది సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశముంది.
Read Also : డేటా ఆఫర్లు అదుర్స్ : ఏప్రిల్ 4 నుంచి జియోఫోన్ 2 ఫ్లాష్ సేల్